Share News

BCCI: బీసీసీఐలో చక్రం తిప్పుతున్న మాజీ జర్నలిస్ట్.. ఈయన బ్యాగ్రౌండ్ తెలుసా?

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:57 PM

బీసీసీఐలో చక్రం తిప్పుతున్నారో మాజీ జర్నలిస్ట్. ఇకపై బోర్డులో ఆయన ఏం చెబితే అదే ఫైనల్ అని తెలుస్తోంది. మరి.. ఎవరాయన? బోర్డు ప్రెసిడెంట్ స్థాయికి ఎలా ఎదిగారు? అనేది ఇప్పుడు చూద్దాం..

BCCI: బీసీసీఐలో చక్రం తిప్పుతున్న మాజీ జర్నలిస్ట్.. ఈయన బ్యాగ్రౌండ్ తెలుసా?
BCCI

భారత క్రికెట్ బోర్డులో గత కొన్నేళ్ల నుంచి జైషా హవా నడుస్తూ వచ్చింది. అటు బీసీసీఐతో పాటు ఇటు ఐపీఎల్ వ్యవహారాల్లోనూ షా మాటే శాసనం అన్నట్లు నడిచింది. అయితే ఐసీసీ చైర్మన్ పోస్ట్‌ కోసం బీసీసీఐ సెక్రెటరీ పదవి నుంచి తప్పుకున్నారు షా. అయినా ఒకవైపు ఐసీసీ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు బీసీసీఐకి సంబంధించిన పనులనూ ఇన్‌డైరెక్ట్‌గా చక్కదిద్దుతూ వచ్చారాయన. బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీతో సమన్వయం చేసుకుంటూ వచ్చారు. అయితే వచ్చే నెలలో బిన్నీకి 70 ఏళ్లు నిండుతుండటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఐసీసీలో షా బిజీ అయిపోయారు. దీంతో నయా ప్రెసిడెంట్‌ను నియమించేందుకు రెడీ అవుతోంది బోర్డు. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఎవరీ రాజీవ్ శుక్లా?

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాజీవ్ శుక్లా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరంలో జన్మించారు. జర్నలిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆయన.. జనసత్తాతో పాటు రవివార్ లాంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల వైపు అడుగులు వేశారు. అఖిల భారతీయ లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. కొన్నాళ్ల తర్వాత కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, అనంతరం రాజ్యసభలో ఎంపీ స్థాయికి ఎదిగారు రాజీవ్ శుక్లా.


జర్నలిస్ట్ టు బీసీసీఐ బాస్..

జర్నలిస్ట్‌గా, రాజకీయ నేతగా మంచి క్రేజ్ సంపాదించుకున్న రాజీవ్ శుక్లా.. మరోవైపు క్రికెట్ వ్యవహారాల్లోనూ బిజీ అయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్‌ అసోసియేషన్‌లో సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. కొన్నాళ్లకు భారత క్రికెట్ బోర్డులో అడుగు పెట్టారు రాజీవ్ శుక్లా. 2011లో ఐపీఎల్ చైర్మన్‌గా నియమితులైన ఆయన.. పలు వివాదాల నడుమ 2013లో ఆ పోస్ట్ నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. మళ్లీ 2015లో చైర్మన్ పీఠం ఎక్కారు. 2020లో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ శుక్లా.. ఇంకా అదే పోస్ట్‌లో కొనసాగుతున్నారు. రోజర్ బిన్నీ స్థానంలో నూతన అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. బీసీసీఐ బాస్‌గా ఎన్నికైతే జనరల్ బాడీ, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్స్‌కు ఆయనే అధ్యక్షత వహించాల్సి ఉంటుంది.


ఇవీ చదవండి:

ఫైనల్‌లో ఫేవరెట్స్ ఎవరు?

కప్పు ఆర్సీబీదే.. ఇదే ప్రూఫ్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 12:57 PM