Share News

Rohit Sharma: రాత మార్చేందుకు రోహిత్ ప్లాన్.. పంజాబ్‌కు దబిడిదిబిడే!

ABN , Publish Date - May 31 , 2025 | 04:38 PM

రోహిత్ శర్మ తనను ఎందుకు బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని పిలుస్తారో మరోమారు నిరూపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో పోరులో విధ్వంసక బ్యాటింగ్‌తో అదరగొట్టాడు హిట్‌మ్యాన్.

Rohit Sharma: రాత మార్చేందుకు రోహిత్ ప్లాన్.. పంజాబ్‌కు దబిడిదిబిడే!
Rohit Sharma

క్రికెట్‌లో కొందరు బిగ్ మ్యాచ్ ప్లేయర్లు ఉంటారు. వీళ్లు అడపాదడపా రాణిస్తున్నా కీలక పోరుల్లో మాత్రం చెలరేగిపోతారు. తమలోని బెస్ట్ టాలెంట్‌ను బయటకు తీసుకొస్తారు. బిగ్ మ్యాచ్ అని ఒత్తిడి తీసుకోకుండా ప్లాన్స్‌కు తగ్గట్లు ఆడతారు. తమ మీద ఉండే ప్రెజర్‌ను అవతలి జట్టు మీదకు నెడతారు. అలాంటి అరుదైన బిగ్ మ్యాచ్ ప్లేయర్లలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఒకడు. కెరీర్‌లో ఎక్కువ మటుకు కీలక మ్యాచుల్లో రాణించాడతను. నిన్న మరోమారు ఇదే పని చేశాడు. ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడీ ముంబైకర్. 50 బంతుల్లో 81 పరుగుల విన్నింగ్ నాక్ ఆడాడు.


అంతా తన చుట్టే..

మొదటి ఓవర్ నుంచే గుజరాత్ టైటాన్స్‌ను బ్యాక్‌ సీట్‌లోకి నెట్టేశాడు రోహిత్. ఫోర్ల మీద ఫోర్లు బాదుతూ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. భారీ సిక్సులతో బౌలర్లను భయపెట్టాడు. ముంబై భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు హిట్‌మ్యాన్. అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే రోహిత్ ఇక్కడితో ఆగదలచుకోలేదని తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ కోసం అతడు తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. క్వాలిఫయర్-2లో అయ్యర్ సేన పని పట్టేందుకు స్ట్రాటజీలు పన్నుతున్నాడట. పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ బ్యాటింగ్ యూనిట్ మొత్తం తన చుట్టూ తిరిగేలా కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలసి ప్లానింగ్ చేస్తున్నాడని సమాచారం.

Punjab Kings.jpg


దూకుడు మంత్రంతో..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్‌లో ఆడి కప్పు కొట్టిన దాఖలాలు లేవు. అయితే ఈసారి ఎలిమినేటర్ గండాన్ని విజయవంతంగా దాటిన ఎంఐ.. క్వాలిఫయర్-2లో పంజాబ్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. ఇందులో నెగ్గితే ఫైనల్‌కు చేరుకుంటుంది. అందుకే ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడట హిట్‌మ్యాన్. జీటీతో పోరులో ముంబై బ్యాటింగ్‌ను రోహిత్ లీడ్ చేశాడు. ఇదే విధంగా పంజాబ్‌తో మ్యాచ్‌నూ తానే ముందుండి నడిపించాలని అనుకుంటున్నాడట. దూకుడు మంత్రంగా ధనాధన్ షాట్లతో అయ్యర్ సేనపై మెరుపు దాడికి ప్లాన్ చేశాడట. పవర్‌ప్లేలోనే పంజాబ్‌ను కోలుకోకుండా చేయాలని అనుకుంటున్నాడట. మాజీ సారథి ప్లానింగ్‌కు హార్దిక్ కూడా ఎస్ చెప్పాడని.. ఇక ఆచరణే మిగిలిందని తెలుస్తోంది. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే మాత్రం పంజాబ్‌కు దబిడిదిబిడేనని.. రోహిత్ విశ్వరూపానికి ఆ జట్టు బౌలర్లు బలవ్వక తప్పదని అంటున్నారు నెటిజన్స్.


ఇవీ చదవండి:

గిల్ తప్పుతో అంతా నాశనం!

వీల్‌‌చైర్‌ నుంచి సిక్సులు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 04:47 PM