MS Dhoni-Virat Kohli: 17 ఏళ్ల కిందే స్కెచ్.. కోహ్లీ సీక్రెట్ రివీల్ చేసిన ధోని
ABN , Publish Date - May 01 , 2025 | 07:47 PM
Today IPL Match: ఒకప్పుడు టీమిండియాలో ప్లేస్ పర్మినెంట్ అయితే చాలు అనుకునే స్టేజ్లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు భారత్కు మూలస్తంభంగా మారాడు. ఐపీఎల్లోనూ లెజెండరీ ప్లేయర్గా కంటిన్యూ అవుతున్నాడు. అలాంటోడి గురించి మరో దిగ్గజం ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అది 2008వ సంవత్సరం. అప్పుడే టీమిండియాలోకి అడుగుపెట్టాడో నూనుగు మీసాల కుర్రాడు. ఫస్ట్ సిరీస్ నుంచే తన మార్క్ చూపిస్తూ పోయాడు. కట్ చేస్తే.. 2025వ సంవత్సరం. చూస్తుండగానే 17 ఏళ్లు గడిచిపోయాయి. ఒకప్పుడు టీమిండియాలో జూనియర్గా ఉన్న ఆ నూనుగు మీసాల కుర్ర బ్యాటర్ ఇప్పుడు జట్టుకు మూలస్తంభంగా మారాడు. అతడే విరాట్ కోహ్లీ. దశాబ్దంన్నరగా భారత బ్యాటింగ్ భారాన్ని మోస్తూ కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి విరాట్ కెరీర్ తొలినాళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. ఇంతకీ అతడేం అన్నాడంటే..
గట్టి ప్లానింగ్
టీమ్ గెలుపు కోసం తన వంతుగా కాంట్రిబ్యూట్ చేయాలని కోహ్లీ ఎంతో తపనతో ఉండేవాడని ధోని అన్నాడు. ఇన్నింగ్స్ అయిపోయే వరకు నాటౌట్గా ఉండాలని ప్లానింగ్తో ఆడేవాడని తెలిపాడు. తనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండేవాడన్నాడు మాహీ. అప్పట్లో కెప్టెన్-నయా ప్లేయర్ లాంటి రిలేషన్ తమ మధ్య ఉండేదన్నాడు. సీనియర్-జూనియర్ అనే చిన్న లైన్ ఉండేదన్నాడు. అయితే ఇప్పుడు మాత్రం తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఇన్నింగ్స్ చివరి దాకా బ్యాటింగ్ చేయాలనే కోహ్లీ స్కెచ్ను ధోని ఇన్డైరెక్ట్గా రివీల్ చేశాడని అంటున్నారు. టీమిండియాలోకి వచ్చిన కొత్తలోనే కింగ్ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్లేవాడని.. దీనికి మాహీ మాటలే ఉదాహరణ అని కామెంట్స్ చేస్తున్నారు. అదే స్కెచ్ ఇంకా కంటిన్యూ అవుతోందని, ఇప్పటికీ ప్రతి మ్యాచ్లో నాటౌట్గా నిలవాలనే తపనతో బ్యాటింగ్ చేస్తున్నాడని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి