RCB vs SRH: ఆర్సీబీని భయపెడుతున్న సన్రైజర్స్.. పరువు పోవడం ఖాయం!
ABN , Publish Date - May 23 , 2025 | 06:20 PM
ఐపీఎల్-2025లో ఇవాళ రసవత్తర పోరు జరగబోతోంది. ఈ మ్యాచ్ రిజల్ట్తో పాయింట్స్ టేబుల్లో పెద్దగా మార్పులు ఉండవని కొందరు అనుకుంటున్నారు. కానీ తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉంది ఆర్సీబీ. నెగ్గడంతో పాటు పరువును కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

క్యాష్ రిచ్ లీగ్లో మరో పోరాటానికి సిద్ధమవుతోంది ఆర్సీబీ. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా శుక్రవారం జరిగే మ్యాచ్లో ప్రమాదకర సన్రైజర్స్ను ఢీకొట్టనుంది బెంగళూరు. అటు పాటిదార్ సేన 12 మ్యాచుల్లో 8 విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇటు ఎస్ఆర్హెచ్ 12 మ్యాచుల్లో 7 ఓటములతో ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ను కొందరు తేలికగా తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించినందును బెంగళూరు ఓడినా పోయేదేమీ లేదని.. ఆరెంజ్ ఆర్మీ గెలిచినా మారేదేమీ లేదని అనుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్ సన్రైజర్స్ కంటే ఆర్సీబీకి చాలా కీలకమని చెప్పాలి. ఆ టీమ్ పరువుతో పాటు భవితను కూడా ఈ మ్యాచ్ నిర్ణయించనుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
గెలవక తప్పదు!
ఆర్సీబీకి లీగ్ దశలో ఇంకా 2 మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఈ రెండింట్లో నెగ్గితే ఆ జట్టు 21 పాయింట్లకు చేరుతుంది. అదే జరిగితే కనీసం టాప్-2లో నిలుస్తుంది. పంజాబ్ కింగ్స్ గెలుపోటములను బట్టి ఆర్సీబీ నంబర్ 1 స్పాట్తోనూ లీగ్ దశను పూర్తి చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇవాళ సన్రైజర్స్ చేతుల్లో ఓడితే కోహ్లీ జట్టుకు టాప్-2 మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఇప్పటికే ఇంటిదారి పట్టిన కమిన్స్ సేన చేతుల్లో ఓడితే బెంగళూరు పరువు కూడా మటాష్ అయ్యే డేంజర్ ఉంది. అందుకే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గాల్సిన స్థితిలో ఉంది ఆర్సీబీ. అటు హైదరాబాద్ మాత్రం పోయేదేమీ లేదు కాబట్టి తాడోపేడో తేల్చుకుందామని చూస్తోంది. దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాలని భావిస్తోంది. ఆ టీమ్కు షాక్ ఇవ్వాలని అనుకుంటోంది. ఒకవేళ ఆరెంజ్ ఆర్మీ నెగ్గితే మాత్రం ఆ టీమ్ ఫ్యాన్స్కు కాస్త ఉపశమనం లభిస్తుంది. మరి.. ఆర్సీబీ పరువు కాపాడుకుంటుందా లేదా సన్రైజర్స్ తమ అభిమానులకు ఊరట విజయాన్ని అందిస్తుందా.. అనేది చూడాలి.
ఇవీ చదవండి:
16 ఏళ్ల కెరీర్కు స్టార్ గుడ్బై
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి