RCB vs KKR: ఐపీఎల్ రీస్టార్ట్కు వాన ముప్పు.. ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుందా? లేదా?
ABN , Publish Date - May 17 , 2025 | 02:06 PM
ఐపీఎల్-2025 రీస్టార్ట్కు అంతా సిద్ధమైంది. శనివారం సాయంత్రం ఆర్సీబీ-కేకేఆర్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ పోరుకు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. మరి.. ఈ మ్యాచ్ జరుగుతుందా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..

ఇండియా-పాకిస్థాన్ నడుమ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2025 తిరిగి మొదలవుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం సాయంత్రం జరిగే పోరుతో సీజన్ రీస్టార్ట్ అవుతోంది. దీంతో ఈ ఫైట్కు ఎక్కడలేని ప్రాధాన్యత నెలకొంది. ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ఆర్సీబీతో పాటు రేసులో నిలవాలంటే గెలవక తప్పని పరిస్థితుల్లో ఉన్న కేకేఆర్ కూడా ఇవాళ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ అసలు జరుగుతుందా.. లేదా.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి.. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వరుణుడు ఏం చేస్తాడో..
ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఇవాళ ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. వాన కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కూడా ఉందని సమాచారం. అయితే చిన్నస్వామి స్టేడియంలో బెస్ట్ డ్రైనేజీ సిస్టమ్ ఉండటం సానుకూల అంశమనే చెప్పాలి. ఎంత వర్షం పడినా క్షణాల్లో నీటిని తొలగించి, మ్యాచ్ కోసం సిద్ధం చేయగలిగే డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ అందుబాటులో ఉంది. భారీ వర్షం పడినా కనీసం గంట సేపు వరుణుడు శాంతిస్తే ఓవర్లు కుదించయినా మ్యాచ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రద్దయితే..
ఒకవేళ భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ-కేకేఆర్కు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు 11 మ్యాచుల్లో 16 పాయింట్లతో ఉన్న బెంగళూరు ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్కు మరింత చేరువవుతుంది. అదే 12 మ్యాచుల్లో 11 పాయింట్లతో ఉన్న కోల్కతా 12 పాయింట్లకు చేరుకుంటుంది. దీని వల్ల ఆ టీమ్కు నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే చేతిలో ఉన్న 2 మ్యాచుల్లోనూ నెగ్గితే, అదీ భారీ తేడాతో గెలిస్తేనే కేకేఆర్కు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ రెండు మ్యాచుల్లో భారీ తేడాతో నెగ్గినా.. ఇతర జట్ల గెలుపోటముల సమీకరణాలను బట్టి రహానె సేన ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ రద్దయితే కేకేఆర్ ఇంటిదారి పట్టడం ఖాయం.
ఇవీ చదవండి:
కోహ్లీ టెన్త్ మార్క్ షీట్ వైరల్
ఆర్సీబీ మోసం చేసింది: పాటిదార్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి