Share News

IPL 2025 Prize Money: కప్పు కోసం కొట్లాట.. గెలిస్తే కోట్ల వర్షం.. విన్నర్‌కు అందేది ఎంతంటే?

ABN , Publish Date - Jun 03 , 2025 | 08:50 AM

క్రికెట్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్-2025 ఫైనల్‌ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఆర్సీబీ-పంజాబ్ ఈ పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కప్ గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనేది ఇప్పుడు చూద్దాం..

IPL 2025 Prize Money: కప్పు కోసం కొట్లాట.. గెలిస్తే కోట్ల వర్షం.. విన్నర్‌కు అందేది ఎంతంటే?
IPL 2025 Prize Money

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సీజన్‌ను పూర్తి చేసుకుంటోంది. 18వ సీజన్ చివరి దశకు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్-2025 ముగుస్తుంది. క్రికెట్ లవర్స్ అంతా ఎంతో ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్న రోజు ఎట్టకేలకు రానే వచ్చింది. ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారనే చర్చకు ఇవాళ్టితో ఎండ్ కార్డ్ పడుతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు కప్పును సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలుచుకోని ఈ జట్లలో ఎవరు నెగ్గినా సరికొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఈ నేపథ్యంలో విన్నర్ టీమ్‌కు దక్కే ప్రైజ్ మనీ ఎంత.. రన్నరప్‌గా నిలిచే జట్టుకు ఎంత మొత్తం ఇస్తారు.. అనేది ఇప్పుడు చూద్దాం..


మూడేళ్ల నుంచి నో చేంజ్..

ఐపీఎల్-2025 ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ అందుతుంది. అదే రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు రూ.13 కోట్లు ఇస్తారు. ఐపీఎల్-2022 నుంచి విన్నర్ టీమ్స్‌కు ఇంతే మొత్తాన్ని అందిస్తూ వస్తున్నారు. మూడేళ్ల నుంచి ప్రైజ్‌మనీ విషయంలో బీసీసీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే తొలి సీజన్‌తో పోలిస్తే ఏటికేడు ప్రైజ్‌మనీ గణనీయంగా పెరుగుకుంటూ వస్తోంది. 2008లో జరిగిన తొలి సీజన్‌‌లో చాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.4.8 కోట్లు, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌కు రూ.2.4 కోట్లు బహుమతిగా ఇచ్చారు.


ప్రైజ్‌మనీతో పాటు అవార్డులు..

విన్నర్-రన్నరప్ టీమ్స్‌కు ప్రైజ్‌మనీతో పాటు అవార్డులు ఇస్తారు. అలాగే కొన్ని వ్యక్తిగత పురస్కారాలు కూడా ప్రదానం చేస్తారు. సీజన్‌లో అత్యుత్తమంగా రాణించిన ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన యువ క్రికెటర్‌కు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇచ్చి సత్కరిస్తుంది బీసీసీఐ. కాగా, ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్‌లో ఇవాళ సాయంత్రం వాన కురిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ వర్షం వల్ల ఆట సాధ్యం కాకపోయినా టెన్షన్ పడాల్సింది లేదు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. కాబట్టి బుధవారం నాడు మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ ఆ రోజూ ఆట వీలు కాకపోతే టేబుల్ టాపర్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్‌ను విజేతగా ప్రకటిస్తారు.


ఇవీ చదవండి:

ఎవరో కొత్త కింగ్‌..?

వన్డేలకు మాక్సీ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు క్లాసెన్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 09:04 AM