Yuvraj-Gill: గిల్ టీమ్లోకి యువీ.. ఈ స్కెచ్కు మైండ్బ్లాంక్!
ABN , Publish Date - May 27 , 2025 | 03:27 PM
ఐపీఎల్-2025లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగింది గుజరాత్ టైటాన్స్. అయితే ఊహించని రీతిలో వరుస విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది జీటీ. ఇప్పుడు అలాంటి టీమ్లోకి లెజెండ్ యువరాజ్ సింగ్ చేరాడని తెలుస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

ఐపీఎల్-2025లో వరుస విజయాలతో దుమ్మురేపుతోంది గుజరాత్ టైటాన్స్. బడా జట్లను కూడా చిత్తు చేస్తూ ప్లేఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. అయితే లీగ్ దశను విజయవంతంగా ముగించలేకపోయింది. వరుస మ్యాచుల్లో లక్నో సూపర్ జెయింట్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడింది. దీని వల్ల లీగ్ దశను టాప్-2తో ముగించడం కష్టంగా కనిపిస్తోంది. ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఆర్సీబీ గనుక నెగ్గితే క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది. అప్పుడు జీటీ ఎలిమినేటర్లో ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న గిల్ సేనను గట్టెక్కించేందుకు లెజెండ్ యువరాజ్ సింగ్ రంగంలోకి దిగాడని తెలుస్తోంది. శిష్యుడు శుబ్మన్ గిల్ను కాపాడేందుకు దిగ్గజం ఎంట్రీ ఇచ్చాడని సమాచారం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ట్రోఫీనే టార్గెట్!
గుజరాత్ టైటాన్స్ క్యాంప్లో యువరాజ్ చేరినట్లు తెలుస్తోంది. వరుస ఓటముల నేపథ్యంలో ప్లేఆఫ్స్ గండం నుంచి జీటీని గట్టెక్కించేందుకు యువీ వచ్చాడని సమాచారం. గిల్ సేనను ప్లేఆఫ్స్లో గెలిపించడంతో పాటు ట్రోఫీ అందించడమే ధ్యేయంగా అతడు పని చేస్తున్నట్లు సమాచారం. గిల్-యువీ కలసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కష్టాల్లో ఉన్న శిష్యుడ్ని ఆదుకునేందుకు, జీటీకి ఇంకో ట్రోఫీని అందించేందుకు యువీ వచ్చాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. తాత్కాలిక మెంటార్గా అతడు వ్యవహరిస్తాడని సమాచారం. టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్తో పాటు 2 ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న యువీ జీటీ క్యాంప్లో ఉండటం బిగ్ ప్లస్ అని.. ఇక ఆ జట్టుకు తిరుగులేదని నెటిజన్స్ అంటున్నారు. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాకు తోడుగా యువీ వ్యూహాలు కూడా విజయవంతమైతే గుజరాత్ మరో కప్పు కొట్టకుండా ఆపడం ప్రత్యర్థుల వల్ల కాదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి