IND vs ENG Series: ఇండో-ఇంగ్లండ్ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్.. ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్!
ABN , Publish Date - May 26 , 2025 | 02:33 PM
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ త్వరలో మొదలవనుంది. రెండు హేమాహేమీ జట్ల మధ్య జరిగే ఈ పోరును చూడాలని అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఈ తరుణంలో ఈ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్పై అప్డేట్ వచ్చేసింది.

క్రికెట్ లవర్స్ అంతా ఇప్పుడు ఐపీఎల్-2025 బిజీలోనే ఉన్నారు. ప్లేఆఫ్స్, ఫైనల్స్ మీదే అందరి దృష్టి నెలకొంది. ఈసారి ఎవరు కప్పు కొడతారా అని ఫ్యాన్స్ ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. అదే సమయంలో టీమిండియా తదుపరి మ్యాచుల మీదా అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లండ్కు పయనం కానుంది. ఈ రెండు జట్ల మధ్య 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్ జరగనుంది. లాంగ్ ఫార్మాట్లో హేమాహేమీలు లాంటి టీమ్స్ తలపడనుండటంతో ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఉద్దండుల గైర్హాజరీలో కుర్రాళ్లతో కూడిన భారత్ ఎలా ఆడుతుందోనని అంతా ఉత్సుకతతో ఉన్నారు. అలాంటి ఇంట్రెస్టింగ్ సిరీస్కు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ మీద కీలక అప్డేట్ వచ్చింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
విడివిడిగా ప్రసార హక్కులు..
భారత్-ఇంగ్లండ్ సిరీస్ జూన్ 20 నుంచి మొదలవనుంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కుల్ని వేర్వేరు ప్లాట్ఫామ్స్ సొంతం చేసుకున్నాయి. టెలివిజన్ ప్రసార హక్కుల్ని సోనీ స్పోర్ట్స్ సంస్థ దక్కించుకుంది. అదే ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ను జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఇండో-ఇంగ్లండ్ సిరీస్ కోసం పలు బడా ప్లాట్ఫామ్స్ పోటీపడ్డాయి. కానీ ఆఖరుకు టీవీకి విడిగా, ఓటీటీ స్ట్రీమింగ్కు విడిగా హక్కులు ఇచ్చారు. ఈ రెండు జట్ల నడుమ 2026లో 5 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి. ఈ మ్యాచులు కూడా సోనీ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లోనే ప్రసారం కానున్నాయి.
ఫ్రీ స్ట్రీమింగ్!
భారత్-ఇంగ్లండ్ సిరీస్ మ్యాచుల హక్కుల్ని సోనీ స్పోర్ట్స్తో పాటు జియో హాట్స్టార్ దక్కించుకోవడం అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీని వల్ల కొంతమంది జియో కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది. పలు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వాడుతున్న జియో వినియోగదారులకు జియో హాట్స్టార్ యాప్ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అలాంటి వారు ఇండో-ఇంగ్లండ్ సిరీస్ మ్యాచులు ఉచితంగా చూసేయొచ్చు. రూ.195, రూ.949, రూ.299 లాంటి స్పెషల్ రీచార్జ్ ప్లాన్స్ కలిగిన వారు ఈ సిరీస్ కోసం అదనంగా ప్రత్యేకమైన ప్లాన్ను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అయితే అందరు జియో కస్టమర్లకు ఇది వర్తించదు. పైతరహా స్పెషల్ రీచార్జ్ ప్లాన్స్ లేని వారు మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్ కోసం జియో హాట్స్టార్ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి