India Masters: టీమిండియా భారీ విరాళం.. మనసులు గెలిచారు బాస్
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:32 PM
IML T20 League: టీమిండియా మరోమారు మనసులు గెలుచుకుంది. ఆటలోనే కాదు.. చారిటీలోనూ తాము ముందుంటామని, మంచి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని భారత జట్టు ప్రూవ్ చేసింది.

టీమిండియా మరోమారు మంచి మనసును చాటుకుంది. గొప్ప పని కోసం భారీ విరాళం ప్రకటించింది. దక్షిణాసియా బాగు కోసం బ్రిటీష్ ఆసియా ట్రస్ట్ అనే సంస్థతో కలసి నడిచేందుకు సిద్ధమైంది. అయితే టీమిండియా అంటే రోహిత్ సేన అని పొరబడే అవకాశం ఉంది. సౌత్ ఏషియా డెవలప్మెంట్ కోసం ముందుకొచ్చారు భారత దిగ్గజ క్రికెటర్లు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ వంటి లెజెండరీ క్రికెటర్స్ బ్రిటీష్ ఆసియా ట్రస్ట్తో చేతులు కలిపారు. ఆ రీజియన్లోని ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ముందుకొచ్చారు.
జీవితాల్లో కొత్త వెలుగులు
సచిన్, యువీ, పఠాన్ బ్రదర్స్ లాంటి మాజీ క్రికెటర్లంతా కలసి ఇప్పుడు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో ఆడుతున్నారు. ఇండియా మాస్టర్స్ జట్టు తరఫున బరిలోకి దిగి ప్రత్యర్థుల భరతం పడుతున్నారు. వయసు మీద పడినా అదే జోరుతో టోర్నీలో హోరెత్తిస్తున్నారు. తాజాగా బ్రిటీష్ ఆసియా ట్రస్ట్తో ఇండియా మాస్టర్స్ టీమ్ చేతులు కలిపింది. ఆ ట్రస్ట్ను చారిటీ పార్ట్నర్గా ఎంచుకుంది. తద్వారా దక్షిణాసియా ప్రాంతంలో విద్య, జీవనం, బాలల రక్షణ, మానసిక ఆరోగ్యం, ప్రకృతి సంరక్షణ కోసం ఇండియా మాస్టర్స్ టీమ్ వర్క్ చేయనుంది.
మెచ్చుకోవాల్సిందే..
ఫండ్ రైజింగ్తో బ్రిటిష్ ఆసియా ట్రస్ట్కు సాయం అందించనున్నారు దిగ్గజ ఆటగాళ్లు. ఇండియా మాస్టర్స్ టీమ్కు చారిటీ పార్ట్నర్గా ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నామని ఆ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హితన్ మెహతా అన్నారు. స్టార్ క్రికెటర్ల అండతో మరింత మంది విద్యార్థులు, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాగా, భారత మాజీ ఆటగాళ్లు చేసిన పనిని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఫండ్ రైజింగ్ కోసం ముందుకు రావడం, విద్యార్థులతో పాటు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టడం నిజంగా అభినందనీయమని అంటున్నారు.
ఇవీ చదవండి:
ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దు
రోహిత్ సేనపై కుట్ర.. ఫలితం అనుభవించారు
కన్నీళ్లు పెట్టుకున్న నంబర్ వన్ క్రికెటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి