ICC Events: ఐదేళ్లలో 6 ఐసీసీ టోర్నమెంట్లు.. మూడు మన దగ్గరే!
ABN , Publish Date - Jun 15 , 2025 | 03:19 PM
క్రికెట్ లవర్స్కు రాబోయే 5 సంవత్సరాలు పండగే పండగ. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో ఏకంగా 6 ఐసీసీ టోర్నమెంట్స్ జరగనున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్ లవర్స్ కోసం ఎప్పటికప్పుడు బిజీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). బడా టోర్నమెంట్స్ నిర్వహిస్తూ అభిమానులకు మస్తు వినోదాన్ని పంచుతోంది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఐసీసీ ఈవెంట్స్ భారీగా పెరిగాయి. ప్రతి ఏడాది దాదాపుగా ఏదో ఒక ఐసీసీ టోర్నమెంట్ జరుగుతోంది. గత రెండేళ్లలో చూసుకుంటే.. వన్డే వరల్డ్ కప్-2023, టీ20 ప్రపంచ కప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్-2025 జరిగాయి. ఇక్కడితో ఐసీసీ ఆగడం లేదు. రాబోయే ఐదేళ్లలో 6 మేజర్ టోర్నమెంట్స్ నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. ఆ టోర్నీలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
షెడ్యూల్ ఇదే..
వచ్చే ఏడాది ఓ బడా ఐసీసీ టోర్నమెంట్ జరగనుంది. అదే టీ20 ప్రపంచ కప్. భారత్తో పాటు శ్రీలంక ఈ టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది. 2026లో జరిగే ఏకైక ఐసీసీ టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం. ఆ తర్వాతి ఏడాది రెండు ఐసీసీ టోర్నీలు జరుగుతాయి. మొదటిది వన్డే వరల్డ్ కప్-2027. సౌతాఫ్రికా, జింబాబ్వేతో పాటు నమీబియా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
డోన్ట్ మిస్..
2027లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ సమరం కూడా జరగనుంది. దీనికి ఎప్పటిలాగే ఇంగ్లండ్లోని లార్డ్స్ వేదికగా నిలవనుంది. 2028లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. దీనికి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. ఆ తర్వాత సంవత్సరం భారత్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2029 జరగనుంది. ఆ ఏడాది ఆరంభంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా నిర్వహిస్తారు. ఇక, 2030లో జరిగే టీ20 ప్రపంచ కప్కు ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ మరుసటి ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్కు భారత్-బంగ్లాదేశ్ హోస్ట్గా ఉండనున్నాయి.
ఇవీ చదవండి:
వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి