Share News

Hardik Pandya: ఓటమి బాధ తట్టుకోలేకపోయిన హార్దిక్.. ఎంత ఓదార్చినా..!

ABN , Publish Date - Jun 02 , 2025 | 09:57 AM

ముంబై ఇండియన్స్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది హార్దిక్ సేన. ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది ఎంఐ.

Hardik Pandya: ఓటమి బాధ తట్టుకోలేకపోయిన హార్దిక్.. ఎంత ఓదార్చినా..!
Hardik Pandya

ముంబై ఇండియన్స్ గుండె పగిలింది. ఆరో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుందామని భావించిన ఆ జట్టు కల నెరవేరలేదు. పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసి ఐపీఎల్-2025 ఫైనల్‌కు దూసుకెళ్దామని అనుకున్న ఎంఐకి నిరాశ తప్పలేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ ఇరు జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్-2 పోరులో అయ్యర్ సేన విజయఢంకా మోగించింది. ముంబై సంధించిన 203 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది పంజాబ్. దీంతో ఎంఐ అభిమానులు ఓటమి బాధను తట్టుకోలేకపోయారు. ఫ్యాన్స్ కన్నీంటి పర్యంతం అయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బాధను తట్టుకోలేక ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

mumbai-indians.jpg


ఓదార్చిన స్టొయినిస్..

ఓటమి బాధను తట్టుకోలేకపోయాడు హార్దిక్ పాండ్యా. పంజాబ్ విన్నింగ్ రన్‌ను పూర్తి చేయగానే గ్రౌండ్‌లో కూర్చొని ఉండిపోయాడు. దీంతో ప్రత్యర్థి బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ వచ్చి అతడ్ని ఓదార్చాడు. అయినా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు పాండ్యా. అతడు ఎమోషనల్ అవడంతో కొద్దిసేపటికి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. కంటి నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటున్న హార్దిక్‌ను సముదాయించాడు సూర్య. పాండ్యాతో పాటు పలువురు ముంబై ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఓటమి బాధను తట్టుకోలేకపోయిన పేసర్ అశ్వినీ కుమార్‌ను మరో స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా ఓదార్చాడు. ముంబై క్యాంప్ ఎమోషనల్ అయిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్.. ఓడినా భలే ఆడారు అంటూ మెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ సీజన్‌లో మరింత అద్భుతంగా ఆడాలని ప్రోత్సహిస్తున్నారు.


ఇవీ చదవండి:

ముంబై కొంపముంచిన 5 తప్పులు

చరిత్ర సృష్టించిన అయ్యర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 10:04 AM