Share News

CSK vs RR: కాక రేపుతున్న కుర్రాళ్లు.. ఈ మ్యాచ్ మిస్ అవ్వొద్దు!

ABN , Publish Date - May 19 , 2025 | 07:44 PM

ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు పాయింట్స్ టేబుల్‌ను డిస్ట్రబ్ చేయకపోవచ్చు. కానీ భారత క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా ఈ పోరులో తలపడబోయే ప్లేయర్లు రాణించడం చాలా కీలకమనే చెప్పాలి.

CSK vs RR: కాక రేపుతున్న కుర్రాళ్లు.. ఈ మ్యాచ్ మిస్ అవ్వొద్దు!
IPL 2025

ఐపీఎల్-2025 తుదిదశకు చేరుకుంటోంది. ప్లేఆఫ్స్‌కు వెళ్లే జట్లపై కూడా దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. ఇంకో బెర్త్ కోసం లక్నో, ఢిల్లీ, ముంబై జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ టీమ్స్ ఆడే మ్యాచులపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. పోటీలోనే లేవు కదా.. అలాంటప్పుడు వీటి మధ్య పోరు గురించి చర్చించాల్సిన అవసరం ఏం ఉందని అనుకోవచ్చు. కానీ భారత జట్టు భవిష్యత్తు దృష్ట్యా ఈ మ్యాచ్ చాలా ఆసక్తిని సంతరించుకుంది.


అదరగొట్టాలె..

చెన్నై-రాజస్థాన్ జట్లలోని కుర్రాళ్ల మధ్యే రేపు సమరం జరగనుంది. ఇరు టీమ్స్‌లో చాలా మంది ప్రతిభావంతుమైన యువ ఆటగాళ్లు ఉన్నారు. ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, ఉర్విల్ పటేల్ లాంటి సీఎస్‌కే ప్లేయర్లు ఇప్పటికే తామేంటో చూపించారు. ఈ సీజన్‌లో వీళ్లు అవకాశం దొరికినప్పుడల్లా బ్యాటింగ్‌లో అదరగొట్టారు. రషీద్, ఆయుష్ మరింత నిలకడగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అటు రాజస్థాన్ టీమ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఏ స్థాయిలో చెలరేగి ఆడుతున్నాడో చూస్తున్నాం. ఫాస్టెస్ట్ సెంచరీ కూడా బాది భారత భవిష్యత్ తానేనని అతడు నిరూపించాడు. అతడు ఇలాగే ఆడితే రాజస్థాన్ ఫ్రాంచైజీకే కాదు, భారత్ క్రికెట్‌కూ ఢోకా ఉండదు.


రెచ్చిపోవాలె..

వైభవ్ సూర్యవంశీతో పాటు యంగ్‌స్టర్స్ జైస్వాల్, పరాగ్ కూడా అదరగొట్టాల్సిన అవసరం ఉంది. జైస్వాల్, పరాగ్, జురెల్, శాంసన్ వంటి రాజస్థాన్ ప్లేయర్లు రాణించడం, ఫామ్‌లో ఉండటం టీమిండియాకు ఎంతో కీలకం. అందుకే రేపటి మ్యాచ్‌తో పాటు సీజన్‌లో మిగిలిన ఇతర పోరుల్లోనూ ఈ రెండు జట్ల ఆటగాళ్లు సత్తా చాటాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ కోసం ఈ మ్యాచ్‌ను చూడాలని నెటిజన్స్ చెబుతున్నారు. కుర్రాళ్లు రెచ్చిపోయి ఆడితే ఆ మజానే వేరు అని అంటున్నారు. రేపటి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌‌గా ఉండబోతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

టీమిండియా కోసం మందు మానేశాడు

బీసీసీఐ కీలక నిర్ణయం

ఈసారి ఆసియా కప్ జరగనట్టే?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 07:52 PM