CSK vs PBKS MS Dhoni: కుర్రాళ్లతో ఆడుకుంటున్న ధోని.. ఇక దుకాణం మూసుకోవాల్సిందే
ABN , Publish Date - Apr 30 , 2025 | 08:39 PM
CSK vs PBKS Live: సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేస్తున్న ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి. దీంతో యంగ్ ప్లేయర్ల కెరీర్తో అతడు ఆడుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంఎస్ ధోని.. ఇంటర్నేషనల్ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ లెజెండరీ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. అతడి గేమ్ అవేర్నెస్, ప్లానింగ్, స్ట్రాటజీలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. మ్యాచ్ సిచ్యువేషన్, కండీషన్స్కు తగ్గట్లు వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుస్తూ అపోజిషన్ టీమ్స్కు షాకుల మీద షాకులు ఇస్తుంటాడు తలా. అయితే ఇప్పుడు అతడి కెప్టెన్సీలో మునుపటి వాడివేడి కనిపించడం లేదు. దీనికి తోడు యంగ్స్టర్స్తో అతడు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. మాహీ ప్లానింగ్ మరోమారు బెడిసికొట్టింది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అంతా రివర్స్ అయింది. ధోని పంపిన యంగ్ ఓపెనర్లు ఇద్దరూ ఫ్లాప్ అయ్యారు.
ధోని మ్యాజిక్ మిస్..
పంజాబ్తో మ్యాచ్లో షేక్ రషీద్ (11), ఆయుష్ మాత్రే (7) విఫలమయ్యారు. దీంతో కుర్రాళ్లతో ఓపెనింగ్ చేయించడం ఏంటంటూ ధోనీపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఒక యంగ్సర్ట్ను ఓపెనర్గా పంపి, మరో ఓపెనర్గా ఎక్స్పీరియెన్స్డ్ ప్లేయర్ను దించాల్సిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. వైభవ్ సూర్యవంశీకి తోడుగా జైస్వాల్ లాంటి అనుభవం ఉన్న ఆటగాడ్ని పంపిస్తూ రాజస్థాన్ మంచి రిజల్ట్స్ సాధిస్తోందని గుర్తుచేస్తున్నారు. మూడ్నాలుగు మ్యాచుల అనుభవం ఉన్న కుర్రాళ్లను పంపడం కరెక్ట్ కాదని.. వరుసగా ఫెయిల్ అవుతూ పోతే వాళ్లకు తమ టాలెంట్పై నమ్మకం పోతుందని, ఇది తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని హెచ్చరిస్తున్నారు. కుర్రాళ్లను ఎంకరేజ్ చేయడం మంచిదే గానీ ఇలా ఏమాత్రం ప్లానింగ్ లేకుండా అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ ఆడించడం కరెక్ట్ కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తలా మార్క్ కెప్టెన్సీలో ఉండే మ్యాజిక్, ప్లానింగ్, స్ట్రాటజీ మిస్ అవుతోందని.. ఇలాగైతే దుకాణం మూసుకోవాల్సిందేనని కొందరు నెటిజన్స్ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ధోనీ రిటైర్ అవ్వాల్సిందే: గిల్క్రిస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి