Share News

Ronaldo-Kohli: కోహ్లీ-రొనాల్డో సేమ్ టు సేమ్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!

ABN , Publish Date - Jun 09 , 2025 | 10:40 AM

పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియాన్ రొనాల్డో తన దేశానికి రెండో యూఈఎఫ్‌ఏ నేషన్స్ లీగ్ టైటిల్‌‌ను అందించాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన తుదిసమరంలో స్పెయిన్ మీద 5-3 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది పోర్చుగల్.

Ronaldo-Kohli: కోహ్లీ-రొనాల్డో సేమ్ టు సేమ్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!
Cristiano Ronaldo

స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో బిగ్ టైటిల్‌ను పోర్చుగల్‌కు అందించాడు. యూఈఎఫ్‌ఏ నేషన్స్ లీగ్ టైటిల్‌ను టీమ్‌కు అందించాడు రొనాల్డో. జర్మనీలోని మ్యూనిచ్‌ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోరులో పెనాల్టీ షూటౌట్‌లో 5-3 గోల్స్ తేడాతో స్పెయిన్‌ను మట్టికరిపించింది పోర్చుగల్. షూటౌట్‌కు ముందు వరకు రెండు టీమ్స్ 2-2 గోల్స్‌తో సమంగా ఉన్నాయి. నువ్వానేనా అంటూ తలపడుతూ అభిమానులను అలరించాయి. అయితే ఫలితం రాకపోవడంతో అదనపు సమయం కేటాయించారు. అక్కడా రిజల్ట్ రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్‌లో 5-3 తేడాతో పోర్చుగల్ విక్టరీ కొట్టింది. దీంతో రొనాల్డో ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. మోడర్న్ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీని గుర్తుచేశాడతను.


ఆనందం పట్టలేక..

ఆర్సీబీ 18 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను ఇటీవల సొంతం చేసుకుంది. క్యాష్ రిచ్ లీగ్-2025 సీజన్‌‌లో విజేతగా ఆవిర్భవించింది బెంగళూరు. ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి కప్పును కైవసం చేసుకుంది. దీంతో ఏళ్లుగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్న ఆర్సీబీ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంతోషం తట్టుకోలేక గ్రౌండ్‌లోనే కూర్చుండిపోయాడు. ఆనందం పట్టలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇవే మూమెంట్స్ పోర్చుగల్-స్పెయిన్ మ్యాచ్‌లో రిపీట్ అయ్యాయి. రెండో యూఈఎఫ్‌ఏ టైటిల్‌ దక్కడంతో రొనాల్డో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. దీంతో కోహ్లీ-రొనాల్డోలను పోలుస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇద్దరూ తమ ఆటల్లో దిగ్గజాలని.. ఈ విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఇద్దరూ ఒకేలా ఎమోషనల్ అయ్యారని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

బామ్మ కోసం సిక్స్ బాదాడు

ఆల్‌టైమ్ రికార్డ్.. 134 ఏళ్లలో..!

మరిన్నిక్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 10:45 AM