Share News

IPL 2025: ఐపీఎల్‌పై ఆసీస్ బోర్డు ట్విస్ట్.. వాళ్లే డిసైడ్ చేయాలంటూ..

ABN , Publish Date - May 13 , 2025 | 08:26 AM

BCCI: ఐపీఎల్-2025ను పునరుద్ధరించాలని నిర్ణయించింది భారత క్రికెట్ బోర్డు. సవరించిన షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన జరుగుతుంది. అయితే ఓవర్సీస్ ఆటగాళ్లు మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ల రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

IPL 2025: ఐపీఎల్‌పై ఆసీస్ బోర్డు ట్విస్ట్.. వాళ్లే డిసైడ్ చేయాలంటూ..
IPL 2025

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్-2025ను పునరుద్ధరించాలని నిర్ణయించింది బీసీసీఐ. మే 17 నుంచి మిగిలిన మ్యాచులు మొదలుకానున్నాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3వ తేదీన టోర్నీ ఫైనల్ జరగనుంది. బెంగళూరు, జైపూర్, లక్నో, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో మ్యాచులు జరుగుతాయి. అయితే టోర్నీని పునరుద్ధరించడానికి బీసీసీఐ సిద్ధమవుతున్నా.. ఓవర్సీస్ ఆటగాళ్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, జోష్ హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ లాంటి ఆస్ట్రేలియా స్టార్లు క్యాష్ రిచ్ లీగ్ కోసం తిరిగొస్తారా అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా బోర్డు వాళ్లను ఇండియా పంపేందుకు ఒప్పుకుంటుందా అనేది అనుమానంగా మారింది. ఈ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..


టెన్షన్ అదే..

ఐపీఎల్ మిగిలిన మ్యాచుల కోసం భారత్‌కు వెళ్లాలా.. వద్దా.. అనేది ప్లేయర్ల ఇష్టానికే వదిలేస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. వచ్చే నెలలో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. లార్డ్స్ స్టేడియంలో జరిగే ఈ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది ఆసీస్. కప్పు కోసం పోరు కావడంతో తమ ఆటగాళ్లను పంపేందుకు అక్కడి బోర్డు ఒప్పుకోకపోవచ్చని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు బంతిని ప్లేయర్ల కోర్టులో వేసింది సీఏ. భారత్‌కు వెళ్లాలా.. వద్దా.. అనేది ఆటగాళ్ల ఇష్టమని, వాళ్లకు తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేసింది. అయితే ఐపీఎల్‌కు వెళ్లే ప్లేయర్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎలా సన్నద్ధం అవుతారనేది తమను కలవరపెడుతోందని పేర్కొంది.


ఆపమంటూనే..

ఆటగాళ్ల భద్రతపై ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పాటు బీసీసీఐతోనూ చర్చలు జరుపుతున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా వివరించింది. అయితే ఐపీఎల్‌ కోసం వెళ్లాలా.. వద్దా.. అనేది ప్లేయర్ల ఇష్టమంటూ సీఏ చెప్పడంతో ఒకవేళ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడి గాయపడితే దానికి ప్లేయర్లే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు వెళ్లాలనుకుంటే ఆపమని చెబుతూనే.. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహాల్లో ఇబ్బందులు ఎదురువుతాయంటూ ప్లేయర్లకు సీఏ ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు రావాలా.. వద్దా.. అనేది ప్లేయర్లే తేల్చుకోవాలని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

ఆ చరిత్రనే మార్చి

6 వేదికల్లో ఐపీఎల్‌

నాకు నీ కన్నీళ్లు గుర్తుంటాయి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 13 , 2025 | 08:34 AM