IND vs ENG: టీమిండియా కోసం మందు మానేసిన ఇంగ్లండ్ స్టార్.. పెద్ద ప్లానింగే!
ABN , Publish Date - May 19 , 2025 | 02:43 PM
భారత క్రికెట్కు మున్ముందు కఠిన సవాళ్లు ఎదురవనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ముగ్గురు దిగ్గజాలు వీడ్కోలు చెప్పడంతో టెస్టుల్లో ఇకపై టీమిండియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ సిరీస్తో భారత యువ జట్టు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తేలిపోనుంది.

భారత జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. రెండింటా పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఫార్మాట్తో సంబంధం లేకుండా ఆడిన ప్రతి చోట అదరగొడుతోంది. అందుకే మన టీమ్తో పెట్టుకోవాలంటే ఎంతటి తోపు జట్టు అయినా భయపడక తప్పని పరిస్థితి. భారత్తో మ్యాచ్ కోసం సరికొత్త వ్యూహాలతో సన్నద్ధమవుతుంటాయి అపోజిషన్ టీమ్స్. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా అదే పనుల్లో బిజీగా ఉంది. ముఖ్యంగా ఆ టీమ్ స్టార్ ఆల్రౌండర్, కెప్టెన్ బెన్ స్టోక్స్ స్ట్రాటజీ ప్లానింగ్లో మునిగిపోయాడు. అంతేగాక భారత సిరీస్ నేపథ్యంలో ఏకంగా మందు కూడా మానేశాడు. అతడు ఎందుకిలా చేశాడో ఇప్పుడు చూద్దాం..
ఫుల్ ఫోకస్
ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మద్యం మానేశాడు. టీమిండియాతో జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్లో తలపడనున్నారు ఇంగ్లీష్ ఆటగాళ్లు. ఈ నేపథ్యంలో ఫిట్గా ఉండేందుకు ఆల్కహాల్ తీసుకోవడం ఆపేశాడు స్టోక్స్. గాయం కారణంగా 6 నెలలుగా ప్రొఫెషనల్ క్రికెట్కు దూరంగా ఉంటున్న ఈ స్టార్ ఆల్రౌండర్.. జింబాబ్వేతో సిరీస్లో పునరాగమనం చేయనున్నాడు. మే 22న జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్లో పాల్గొననున్నాడు. అయితే అతడి చూపు మాత్రం టీమిండియాతో జరిగే 5 టెస్టుల సిరీస్ మీదే నెలకొంది. డబ్ల్యూటీసీ నయా సైకిల్లో జరిగే తొలి సిరీస్ కావడంతో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది ఇంగ్లండ్. దీనికి తోడు సీనియర్లు లేకపోయినా డేంజరస్ గేమ్తో భయపెట్టే కుర్రాళ్లు టీమ్ నిండా ఉండటంతో భారత్ను తక్కువ అంచనా వేసేందుకు లేదు. అందుకే మందు మానేసి ఫిట్నెస్ పెంచుకోవడం, జూన్ రెండో వారానికల్లా పూర్తి సంసిద్ధతతో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాడు స్టోక్స్.
మానేశా.. కానీ?
భారత సిరీస్ కోసం తాత్కాలికంగా మద్యం మానేస్తున్నట్లు స్టోక్స్ తెలిపాడు. అంతేగానీ ఆల్కహాల్ను పూర్తిగా పక్కనబెట్టడం లేదని స్పష్టం చేశాడు. టీమిండియాతో టెస్ట్ సిరీస్ కోసం పూర్తిగా సన్నద్ధమవడం, తన శక్తి మేరకు రాణించడం కోసమే కొన్నాళ్లు మందును పక్కన పెడుతున్నట్లు పేర్కొన్నాడు. కాగా, గాయాలతో నిత్యం సావాసం చేసే స్టోక్స్.. 2022లో వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇంజ్యురీల వల్ల టీ20లకు అతడు దూరంగా ఉంటున్నాడు. కేవలం టెస్టుల్లోనే అతడు కొనసాగుతున్నాడు. గాయాల భయం, టెస్టు కెరీర్ ప్రమాదంలో పడొచ్చనే ఆందోళనతో ఐపీఎల్కూ దూరంగా ఉంటున్నాడు ఇంగ్లండ్ సారథి.
ఇవీ చదవండి:
ఆర్సీబీలోకి ఎక్స్ప్రెస్ బౌలర్
ఒక్కరు గెలిస్తే ముగ్గురు ముందుకెళ్లారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి