Share News

BCCI: తమాషాగా ఉందా.. బెంగళూరు తొక్కిసలాటపై బీసీసీఐ సీరియస్!

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:42 PM

తీవ్ర విషాదాన్ని మిగిల్చిన బెంగళూరు తొక్కిసలాట ఘటనపై భారత క్రికెట్ బోర్డు మరోమారు స్పందించింది. ముమ్మాటికీ తప్పు వాళ్లదేనని స్పష్టం చేసింది. ఇంతకీ బీసీసీఐ ఏం చెప్పిందంటే..

BCCI: తమాషాగా ఉందా.. బెంగళూరు తొక్కిసలాటపై బీసీసీఐ సీరియస్!
BCCI

ఆర్సీబీ సెలబ్రేషన్స్‌లో భాగమవుదామని వచ్చిన అభిమానులు తొక్కిసలాట కారణంగా ప్రాణాలు వదిలారు. ఐపీఎల్-2025 ట్రోఫీని కైవసం చేసుకున్న పాటిదార్ సేన.. బెంగళూరులో ఘనంగా విక్టరీ పరేడ్‌ను నిర్వహించింది. అనూహ్యంగా లక్షలాది మంది తరలిరావడంతో తొక్కిసలాట జరగగా.. అందులో 11 మంది చనిపోయారు. 50కి పైగా అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనే చర్చలు ఊపందుకున్నాయి. ప్రభుత్వమా లేదా ఆర్సీబీనా లేదా భారత క్రికెట్ బోర్డా.. ఎవరి తప్పిదం వల్ల ఇది జరిగిందంటూ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ తరుణంలో తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ మరోమారు స్పందించింది. ఇది ముమ్మాటికీ ఆర్సీబీ తప్పేనంటూ సీరియస్ అయింది. కార్యక్రమం కోసం సరైన ప్లానింగ్ చేయకపోవడం, హడావుడిగా నిర్వహించడం వల్లే ఇలా జరిగిందని స్పష్టం చేసింది.


ఊరుకోబోం..

బెంగళూరు తొక్కిసలాట లాంటి ఘటనలను తాము చూస్తూ ఊరుకోబోమని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా అన్నారు. ఐపీఎల్ కప్పు గెలిచిన జట్లు నిర్వహించే సెలబ్రేషన్స్, విన్నింగ్ పరేడ్‌ల విషయంలో ఇకపై గవర్నింగ్ బాడీ కఠినంగా వ్యవహరించబోతోందని తెలిపారు. ఏదో ఒకటి చేసి తీరుతామని, చూస్తూ ఊరుకునేది లేదన్నారు. బెంగళూరులో నిర్వహించిన విక్టరీ పరేడ్ ఆర్సీబీ సొంత వ్యవహారమని సైకియా చెప్పారు. కానీ భారత్‌లో క్రికెటింగ్ వ్యవహారాల బాధ్యత తమదే కాబట్టి.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు.

WhatsApp Image 2025-06-07 at 12.17.40 PM.jpeg


నో ప్లానింగ్..

‘బీసీసీఐ గనుక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. చాలా సమయం తీసుకొని కార్యక్రమాలను ప్లాన్ చేస్తాం. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌ను ముంబైలో ఎంత చక్కగా నిర్వహించామో అంతా చూశారు. కానీ బెంగళూరులో అలా కాదు. తక్కువ టైమ్‌లో సరైన ప్లానింగ్ లేకుండా నిర్వహించారు. తొక్కిసలాటకు ఇదో కారణమని చెప్పాలి. ఇది చాలా దురదృష్టకరం. దీని నుంచి మేం తప్పించుకోవాలని చూడట్లేదు. కానీ ఇకపై మేం జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఇలాంటి కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో చెబుతూ అడ్వైజరీ జారీ చేస్తాం. ఇలాంటి విషాద ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని సైకియా చెప్పుకొచ్చారు.


ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్

ఐపీఎల్ లెజెండ్ రిటైర్‌మెంట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 07 , 2025 | 12:52 PM