BCCI: బీసీసీఐ కొత్త రూల్స్.. గీత దాటితే దబిడిదిబిడే!
ABN , Publish Date - Jun 12 , 2025 | 01:01 PM
భారత క్రికెట్ బోర్డు కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవి గనుక అమల్లోకి వస్తే ఫ్రాంచైజీలకు దబిడిదిబిడేనని సమాచారం. మరి.. బీసీసీఐ తీసుకొచ్చే నయా రూల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

భారత క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇండియన్ క్రికెట్ బాగు కోసం చేయాల్సిన మార్పుచేర్పుల విషయంలో బోర్డు ఎప్పుడూ వెనుకాడదు. ఇది గతంలో ఎన్నోసార్లు చూశాం. సరికొత్త నిబంధనలు తీసుకొస్తూ సమస్యలకు పాతర పెడుతూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా మరోసారి నయా రూల్స్ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 4న నిర్వహించిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు నిర్వహించే వేడుకల విషయంలో కొత్త నియమ, నిబంధనలను తీసుకొచ్చేందుకు సమాయత్తం అవుతోందట బీసీసీఐ. దీని గురించి మరింతగా చూద్దాం..
పాటించాల్సిందే..
బీసీసీఐ జూన్ 14వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు తొక్కిసలాట లాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా పలు మార్గదర్శకాలను జారీ చేయనుందట. ఇవాళ జరిగే అపెక్స్ మీటింగ్లో ఐపీఎల్ విన్నింగ్ టీమ్స్ నిర్వహించుకునే విక్టరీ పరేడ్స్, ఇతర సెలబ్రేషన్స్ వేళ పాటించాల్సిన రూల్స్ను రూపొందించనున్నారని సమాచారం. ఇది వర్చువల్గా జరిగే అవకాశం ఉందని వినిపిస్తోంది. నిబంధనల్ని గనుక అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. కాగా, తొక్కిసలాట కేసుపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విషాద ఘటనకు ఆర్సీబీదే బాధ్యత అని.. ఫ్రాంచైజీ నిర్లక్ష్యం, తొందరపాటు, అత్యుత్సాహం వల్లే 11 మంది ప్రాణాలు పోయాయని కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి అన్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి