Abhishek-Digvesh: దిగ్వేష్తో గొడవపై అభిషేక్ రియాక్షన్.. ఏదో తేడా కొడుతోంది!
ABN , Publish Date - May 20 , 2025 | 02:01 PM
ఐపీఎల్-2025 క్రమంగా చివరి దశకు చేరుకుంటోంది. ఇంకొన్ని మ్యాచులైతే లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మొదలవుతుంది. ఈ తరుణంలో అభిషేక్ శర్మ-దిగ్వేష్ రాఠీ ఫైట్.. ఒక్కసారిగా క్యాష్ రిచ్ లీగ్లో హీట్ పుట్టించింది.

ఐపీఎల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సర్వసాధారణమే. ప్రతి బాల్, ప్రతి పరుగు కీలకం కాబట్టి ఫైట్స్ మామూలే. ఎక్కువగా విదేశీ స్టార్లు, టీమిండియా స్టార్లకు మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే చాలా వరకు ఫైట్స్ను అంపైర్లు, సహచర ఆటగాళ్లు కలసి సద్దుమణిగేలా చేస్తుంటారు. కానీ కొన్ని మాత్రం జరిమానాలు, నిషేధాల వరకు దారితీస్తుంటాయి. వీటి వల్ల ఒక్కసారిగా అందరి చూపు లీగ్ వైపు షిఫ్ట్ అవుతుంది. లక్నో సూపర్ జెయింట్స్-సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్లో అదే జరిగింది. లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ, సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరి పైకి ఒకరు దూసుకెళ్లారు. హాట్ టాపిక్గా మారిన ఈ ఫైట్పై అభిషేక్ స్పందించాడు. అతడు ఏం అన్నాడంటే..
వదలడం కష్టమే..!
మ్యాచ్ ముగిసిన తర్వాత దిగ్వేష్తో తాను మాట్లాడానని అభిషేక్ తెలిపాడు. ఇప్పుడు అంతా కూల్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. గొడవ సద్దుమణిగిందన్నాడు పులి. తమ మధ్య అంతా సవ్యంగానే ఉందని పేర్కొన్నాడు. అయితే అభిషేక్ మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిందేమీ లేదని.. ఆట ముగిశాక ఇద్దరూ కలసుకున్నారని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం అభిషేక్ తీరు చూస్తుంటే ఏదో తేడా కొడుతోందని.. దిగ్వేష్ను వదిలేలా లేడని కామెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐపీఎల్లో అతడ్ని చావబాదడం ఖాయమని, అంతకంతా ఇచ్చిపడేస్తాడని చెబుతున్నారు. మ్యాచ్ ముగిశాక దిగ్వేష్ను కలసిన సమయంలోనూ అభిషేక్ సీరియస్గానే ఉన్నాడని.. సంజీవ్ గోయెంకా, రాజీవ్ శుక్లా కూల్ చేసేందుకు ప్రయత్నించినా అతడు అస్సలు వినలేదని అంటున్నారు. నోట్బుక్ సంబురాలు చేసుకుంటాడా.. దిగ్వేష్కు అభిషేక్ చుక్కలు చూపించడం ఖాయమని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి