Railway Station: నేరస్థులు ఇక తప్పించుకోవడం కష్టమే.. ఈ స్టేషన్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే..
ABN , Publish Date - May 31 , 2025 | 11:32 AM
రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేరస్థుల ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ ఒకటి. అయితే ఈ స్టేషన్లోకి అడుగుపెట్టే నేరస్థులను వెంటనే పట్టుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..

రద్దీగా ఉండే బస్సు, రైల్వే స్టేషన్లలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా చోరీలు జరిగే ప్రమాదం ఉంటుంది. నేరస్థులు ఇలాంటి ప్రాంతాలను అడ్డాగా చేసుకుని చోరీలకు తెగబడుతుంటారు. ఇక సికింద్రాబాద్ వంటి అత్యంత రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇకపై రైల్వే స్టేషన్లలో ఇలా నేరాలు చేసే వారికి షాకిచ్చేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోని ఢిల్లీ, హౌరా, సెల్దా, ముంబయి, ధనపూర్, చెన్నైతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. వివరాల్లోకి వెళితే..
రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేరస్థుల ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో (Secunderabad Railway Station) సికింద్రాబాద్ ఒకటి. ప్రస్తుతం ఈ స్టేషన్ పాత భవాన్ని కూల్చేసి ఆధునికీకరిస్తున్నారు. అయితే కొత్తగా నిర్మించే భవనంలో ఈ షేసియల్ రికగ్నిషన్ కెమెరాలను (Facial recognition cameras) ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కెమెరాల సాయంతో ఇటీవల కుంభమేళాలో కూడా అనేకమంది అనుమాతులను గుర్తించారట. అలాగే బెంగళూరు రైల్వే స్టేషన్లలో ఈ కెమెరాల సాయంతో 90 రోజుల వ్యవధిలో 47 మంది అనుమానితులను పట్టుకున్నారని తెలిసింది.
ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలకు సంబంధించిన డేటాబేస్ను నిల్వ చేసేందుకు ఢిల్లీలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా నిర్మించారు. సుమారు రూ.18 కోట్లతో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో సంచరించే అనుమానితులు, నేరస్థుల చిత్రాలను ఈ డేటాబేస్లో భద్రపరుస్తారు. ఏఐ టెక్నాలజీ సాయంతో నడిచే ఈ కెమెరాలు.. నేరస్థులు ఎక్కడ కనిపించినా ఇట్టే పట్టేస్తాయట. ఒకవేళ వారు ముఖానికి మాస్కులు ధరించినా కూడా సులభంగా పట్టేయగల సామర్థ్యం వీటికి ఉంటుందట. ఈ కెమెరాలను సికింద్రాబాద్లో ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఇంజినీర్కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్ను ఎక్కడ కట్టాడో చూడండి..
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..