Share News

Breaking News: కేంద్రం కఠిన నిర్ణయాలు..

ABN , First Publish Date - Apr 23 , 2025 | 11:22 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: కేంద్రం కఠిన నిర్ణయాలు..
Pahalgam Terror Attack

Live News & Update

  • 2025-04-23T21:53:07+05:30

    Pahalgam Terror Attack: కేంద్రం కఠిన నిర్ణయాలు..

    • ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ (CCS)సమావేశంలో కీలక నిర్ణయాలు.

    • పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై సమావేశంలో విస్తృతంగా చర్చ.

    • ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.

    • ఈ ఘటనను CCS తీవ్రంగా ఖండించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

    • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

    • ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఖండిస్తూ భారతదేశానికి సంఘీభావం ప్రకటించాయి.

    • ఈ సంఘీభావానికి CCS కృతజ్ఞతలు తెలిపింది. ఇది ఉగ్రవాదానికి ఏమాత్రం స్థానం లేదు అనే సూత్రాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది.

    • ఈ ఉగ్రదాడికి సంబంధించి అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు బ్రీఫింగ్‌లో వెల్లడయ్యాయి.

    • కేంద్ర పాలిత ప్రాంతంలో విజయవంతంగా ఎన్నికలు జరగడం, ఆర్థిక అభివృద్ధి దిశగా జరుగుతున్న పురోగతిని ఈ దాడి లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు.

    • ఈ దాడి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, CCS కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

    • (1) 1960లో కుదిరిన ఇండస్ జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తోంది. ఇది పాకిస్తాన్ తన క్రాస్ బోర్డర్ ఉగ్రవాదాన్ని నిర్ధారితంగా, తిరిగిరాని రీతిలో విరమించేవరకు అమల్లోకి రాదు.

    • (2) ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ - అటారి (Attari) తక్షణమే మూసివేయబడుతుంది. ఇప్పటికే ఆ మార్గం ద్వారా వచ్చిన వారు, 2025 మే 1లోగా తిరిగి వెళ్లవచ్చు.

    • (3) పాకిస్తాన్ పౌరులకు SAARC Visa Exemption Scheme (SVES) వీసాలపై భారతదేశ ప్రవేశం నిషిద్ధం. ఇంతకుముందు జారీచేసిన SVES వీసాలు రద్దు చేయబడ్డాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలి.

    • (4) న్యూఢిల్లీ లోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నౌకాదళ, వాయుసేన సలహాదారులను ‘పర్సోనా నాన్ గ్రాటా’గా ప్రకటించి, వారిని వారంలోగా దేశం విడిచి వెళ్లమని ఆదేశించింది. ఇదే విధంగా భారత హైకమిషన్, ఇస్లామాబాద్‌ నుంచి భారత్ తన సలహాదారులను వెనక్కి పిలుపు తీసుకుంది. ఈ పదవులను రద్దు చేసింది. అలాగే 5 మంది సపోర్ట్ స్టాఫ్ కూడా వెనక్కి పిలిపించనుంది.

    • (5) భారత్, పాకిస్తాన్ హైకమిషన్లలోని సిబ్బంది సంఖ్యను 55 నుండి 30కి తగ్గించనుంది. ఈ మార్పులు 2025 మే 1లోగా అమల్లోకి వస్తాయి.

    • CCS దేశ భద్రతా పరిస్థితిని సమీక్షించింది. అన్ని భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్న ఆదేశాలు ఇచ్చింది.

    • ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిని చట్టానికి లోబడి శిక్షించడమే కాక, వారికి మద్దతు ఇచ్చిన వారినీ చర్యలను బహిరంగంగా బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటామని సంకల్పించింది.

    • తాజాగా తహవ్వూర్ రాణాను భారతదేశానికి అప్పగించిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదం పట్ల కఠినమైన ధోరణిని భారత్ కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.

  • 2025-04-23T19:03:00+05:30

    భారత్‌ను ఎవరూ భయపెట్టలేరు: రాజ్‌నాథ్‌

    • అతి త్వరలో ప్రతీకారం తీర్చుకుంటాం.

    • పహల్గామ్‌ దాడుల వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.

    • ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

    • ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టం.

    • ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో బదులిస్తాం.

    • ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం.

  • 2025-04-23T18:32:00+05:30

    ఢిల్లీ: ప్రధాని మోదీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం

    • మోదీ అధ్యక్షతన భద్రత వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ

    • హాజరైన అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌..

    • విదేశాంగమంత్రి జైశంకర్‌, భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌

    • పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో కీలక సమావేశం

  • 2025-04-23T16:13:47+05:30

    జమ్మూకశ్మీర్‌: పహల్గామ్‌ నుంచి ఢిల్లీ బయల్దేరిన అమిత్‌ షా

    • సాయంత్రం ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న..

    • కేబినెట్‌ సమావేశంలో పాల్గొననున్న హోంమంత్రి అమిత్‌ షా

    • ఉగ్రవాదుల ఏరివేతకు కార్యాచరణపై దృష్టి సారించనున్న కేంద్రం

    • త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు సమాచారం

  • 2025-04-23T16:10:12+05:30

    సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరిస్తున్న పాకిస్థాన్‌

    • పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు దగ్గరగా ఉన్న..

    • భారత సరిహద్దుల దగ్గరకు యుద్ధ విమానాలు తరలిస్తున్న పాక్‌

    • కరాచీ సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ నుంచి..

    • లాహోర్‌, రావల్పిండికి యుద్ధ విమానాలు తరలిస్తున్న పాకిస్థాన్‌

    • ఉత్తరాన స్థావరాల్లోనూ భారీగా సైన్యాన్ని మోహరిస్తున్న పాక్‌

    • భారత్‌ తీవ్ర చర్యలకు పాల్పడితే తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్న పాక్‌

  • 2025-04-23T15:51:06+05:30

    కాల్పులు జరిపిన టెర్రరిస్టులు వీళ్లే..

  • 2025-04-23T15:49:38+05:30

    ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్..

    • దారుణమైన పహల్గామ్ దాడి మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది.

    • మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.

    • జనసేన తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల సంతాప దినాలను పాటిస్తుంది.

    • మా పార్టీ జెండా సగం ఎత్తులో ఎగురుతుంది.

    • మన భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదు.

    • అలాంటి దారుణాలు మరలా జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి.

    • అందరం క‌లిసి ‌నడిస్తేనే ఉగ్రవాద దుశ్చర్యలు ను అడ్డుకోగలం.

  • 2025-04-23T15:38:35+05:30

    ఢిల్లీకి నేవీ అధికారి మృతదేహం తరలింపు..

    • పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన నేవీ అధికారి మృతదేహాన్ని ఢిల్లీకి తరలించారు.

    • వినయ్ నార్వాల్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం హర్యానాకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

    • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మృతదేహానికి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, ఢిల్లీ సీఎం రేఖాగుప్త, ఆర్మీ, నేవీ అధికారులు.

  • 2025-04-23T13:29:22+05:30

    ఉగ్రదాడిని అడ్డుకోబోయి..

    • జమ్మూకశ్మీర్: టూరిస్టులను పహెల్‌గామ్‌కు తీసుకెళ్లిన హార్స్ రైడర్ హుస్సేన్

    • పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను అడ్డుకునేందుకు హుస్సేన్ యత్నం

    • తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరపడంతో హుస్సేన్ మృతి

  • 2025-04-23T12:58:00+05:30

    28 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు వీరే..

    • జమ్మూ కశ్మీర్: ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించిన నిఘావర్గాలు

    • తొలుత ముగ్గురి ఊహాచిత్రాలు రూపొందించిన కేంద్ర నిఘావర్గాలు

    • అనంతరం నలుగురి అసలైన ఫొటోలు గుర్తించిన నిఘావర్గాలు

    • కాగా, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న తీవ్ర గాలింపు చర్యలు

      Terrorists.jpg

  • 2025-04-23T12:26:06+05:30

    జనసేన సంతాప దినాలు..

    • ఉగ్రదాడికి నిరసనగా జనసేన ఆధ్వర్యంలో సంతాప దినాలు

    • మూడ్రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన జనసేన

    • మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో పార్టీ జెండాను అవనతం చేసిన నేతలు

  • 2025-04-23T12:24:21+05:30

    ఉగ్రదాడి.. బాధితులకు ఎక్స్‌గ్రేషియా

    • ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం

    • మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన జమ్మూకశ్మీర్ సర్కార్

    • దాడిలో తీవ్రగాయాలైన వారికి రూ.2లక్షల చొప్పున పరిహారం

    • స్వల్ప గాయాలైన బాధితులకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా

  • 2025-04-23T12:22:21+05:30

    • పహెల్‌గామ్ ఉగ్రదాడిపై కేంద్ర నిఘా వర్గాలు కీలక ప్రకటన

    • ఉగ్రదాడిలో అమెరికాలో తయారైన M4, AK-47/56 తొపాకులు వాడినట్లు నిర్ధారణ

    • స్థానికుల సహకారంతో దాడిని అమలు చేశారని తెలిపిన నిఘా వర్గాలు

  • 2025-04-23T12:20:25+05:30

    • పహెల్‌గామ్ ఘటనాస్థలికి కేంద్రమంత్రి అమిత్‌షా

    • ఉగ్రదాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అమిత్‌షా

    • పహెల్‌గామ్ ప్రాంతంలో భారీగా మోహరించిన ఆర్మీ

  • 2025-04-23T11:43:20+05:30

    ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన అమిత్ షా..

    • పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

    • 26 మంది మృతుల కుటుంబాలను పరామర్శించిన అమిత్ షా

    • ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారినీ పరామర్శించిన కేంద్ర హోంమంత్రి

    • అనంతరం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పుష్పగుచ్చాలతో మృతులకు నివాళులర్పించిన అమిత్ షా

  • 2025-04-23T11:41:45+05:30

    బీజేపీ నిరసన..

    • హైదరాబాద్: ఉగ్రదాడిని ఖండిస్తూ ట్యాంక్‌బండ్‌పై బీజేపీ నిరసన

    • జాతీయ జెండాలతో బీజేపీ నేతల ర్యాలీ

    • ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు

    • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బీజేపీ నేతల నినాదాలు

  • 2025-04-23T11:37:48+05:30

    అమిత్ షా నివాళులు..

    ఉగ్రదాడిలో మరణించిన భారత్ పౌరులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు

    శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించిన అమిత్ షా

  • 2025-04-23T11:28:41+05:30

    కాల్పులు చేస్తూ వీడియోలు తీసిన ఉగ్రవాదులు..

    • పహెల్‌గామ్ ఉగ్రదాడిని వీడియో తీసిన ఉగ్రవాదులు

    • హెల్మెట్ కెమెరాలతో దాడిని చిత్రీకరించిన ముష్కరులు

    • టూరిస్టులను చంపే ముందు ఐడీలను చెక్ చేసిన టెర్రరిస్టులు

    • సైనిక దుస్తులు ధరించి పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులు

    • తర్వాత అసలైన సైనికులు వచ్చినా వణికిపోయిన బాధితులు

  • 2025-04-23T11:27:21+05:30

    రక్షణ మంత్రి అత్యవసర సమావేశం..

    • ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో కీలక సమావేశం

    • రక్షణమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన భేటీ

    • పాల్గొన్న త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్

    • ఉగ్రదాడి, చొరబాట్ల నేపథ్యంలో సమావేశం

  • 2025-04-23T11:26:19+05:30

    జమ్మూకశ్మీర్ పర్యటకంపై ఉగ్రదాడి ఎఫెక్ట్

    • జమ్మూకశ్మీర్ పర్యటకంపై పహెల్‌గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్

    • స్వస్థలాలకు బయల్దేరిన పర్యాటకులు, శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో రద్దీ

    • పహెల్‌గామ్ ఉగ్రదాడితో ఆందోళనలో తెలంగాణ పర్యాటకులు

    • శ్రీనగర్‌లోని హోటల్‌లో 80 మంది తెలంగాణ పర్యాటకులు

    • పలు జిల్లాల నుంచి నిన్న శ్రీనగర్ వెళ్లిన పర్యాటకులు

  • 2025-04-23T11:22:49+05:30

    శ్రీనగర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

    • జమ్మూకశ్మీర్: శ్రీనగర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

    • పహెల్‌గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన అమిత్‌షా

    • మృతుల కుటుంబాలను పరామర్శించిన అమిత్‌షా

    • మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు