CM Chandrababu: సీఎం చంద్రబాబుతో యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ భేటీ
ABN, Publish Date - Jul 23 , 2025 | 07:06 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ అమరావతిలో మంగళవారం భేటీ అయ్యారు. లులూ ఇంటర్నేషనల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ, లులూ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఎండీ అదీబ్ అహ్మద్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. భారతదేశం, ఆగ్నేయాసియాలో ఆంధ్రప్రదేశ్ను కీలకమైన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడం, ఐటీ, తయారీ, పర్యాటకం, వ్యవసాయ వ్యాపారం, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలు కల్పించడంపై విస్తృత చర్చలు జరిపారు. ఈ భేటీ తర్వాత ఏపీలో వారు పెట్టుబడులు పెడతారని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడలో లులూ మాల్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ అమరావతిలో మంగళవారం భేటీ అయ్యారు.

లులూ ఇంటర్నేషనల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ, లులూ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఎండీ అదీబ్ అహ్మద్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

భారతదేశం, ఆగ్నేయాసియాలో ఆంధ్రప్రదేశ్ను కీలకమైన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడం, ఐటీ, తయారీ, పర్యాటకం, వ్యవసాయ వ్యాపారం, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలు కల్పించడంపై విస్తృత చర్చలు జరిపారు.

ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.

విజయవాడలో లులూ మాల్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ భేటీ తర్వాత ఏపీలో వారు పెట్టుబడులు పెడతారని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
Updated at - Jul 23 , 2025 | 07:09 AM