Rajasthan: పెళ్లి ఆగిపోయింది
ABN , Publish Date - Apr 25 , 2025 | 05:33 AM
పాకిస్థాన్పై భారత్ విధించిన ఆంక్షలతో రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్ పెళ్లి ఆగిపోయింది. సరిహద్దులు మూసివేయడంతో పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు

పాకిస్థాన్పై భారత్ విధించిన ఆంక్షలతో ఓ యువకుడి పెళ్లి నిలిచిపోయింది. రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్కు అట్టారీ సరిహద్దు అవతల.. పాకిస్థాన్లో ఉన్న యువతితో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం పెళ్లి. అయితే.. వరుడి తరఫువారు కొందరు ఇప్పటికే పాకిస్థాన్కు వెళ్లగా.. సైతాన్సింగ్ ఇక్కడే ఉండిపోయాడు. సరిహద్దులను మూసివేయడంతో.. ఇప్పుడేంచేయాలో పాలుపోవడంలేదని ఆయన మీడియాతో వాపోయారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్