Share News

Supreme Court: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:52 PM

Suprem Court: దోషులుగా తేలిన నేతలపై జీవిత కాలం నిషేధం విధించాలంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆ క్రమంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా తన అభిప్రాయాన్ని వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Supreme Court: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..
Supreme Court of India

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: వివిధ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై జీవిత కాల నిషేధాన్ని విధించాలన్న అభ్యర్థను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసులో సదరు వ్యక్తిపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తే సరిపోతుందని తెలిపింది. ఓ వ్యక్తిపై జీవిత కాల నిషేధం అనేది కఠినతరమని పేర్కొంది. అయితే రాజకీయ నేతలపై జీవిత కాల నిషేధం ఎన్నేళ్లు అనే దానిపై నిర్ణయాధికారం పార్లమెంట్‌దేనని ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఖరాకండిగా తేల్చి చెప్పింది. దోషులుగా రుజువు అయితే జీవితకాల నిషేధాన్ని విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం తన అభిప్రాయాన్ని వివరిస్తూ.. సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది.


దోషులుగా తేలిన నేతలపై జీవిత కాలం నిషేధం విధించాలంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆ క్రమంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా తన అభిప్రాయాన్ని వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది

Updated Date - Feb 26 , 2025 | 05:21 PM