Share News

Special Trains: తెలుగు రాష్ట్రాల్లో.. ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:23 PM

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తూ.. రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. కాచిగూడ, సికింద్రాబాద్‌, నరసాపురంలకు ఈ రైళ్లను నడపనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

Special Trains: తెలుగు రాష్ట్రాల్లో.. ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు..

చెన్నై: ప్రయాణికుల సౌకర్యార్ధం పలు ప్రత్యేక రైళ్లు పొడిగిస్తూ దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

- నెం.07191 కాచిగూడ-మదురై(Kachiguda-Madhurai) ప్రత్యేక రైలు మే 12 నుంచి జూన్‌ 4వ తేది వరకు (సోమవారం), మరుమార్గంలో నెం.07192 మదురై-కాచిగూడ ప్రత్యేక రైలు మే 14 నుంచి జూన్‌ 4వ తేది వరకు (బుధవారం) పొడిగించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: రూ.4.98 లక్షలకు ఊటీ కొండ రైలు అద్దెకు..


- నెం.7695 సికింద్రాబాద్‌-రామేశ్వరం ప్రత్యేక రైలు మే 7 నుంచి 28వ తేది వరకు (బుధవారం), మరుమార్గంలో నెం.07696 రామేశ్వరం-సికింద్రాబాద్‌(Rameshwaram-Secundrabad) ప్రత్యేక రైలు మే 9 నుంచి 30వ తేది వరకు (శుక్రవారం) నాలుగు సర్వీసుల చొప్పున పొడిగించారు.

nani2.2.jpg

- నెం.07153 నరసాపురం - బెంగళూరు(Narsapurasm-Bengaluru) ప్రత్యేక రైలు మే 9 నుంచి జూన్‌ 27వ తేది వరకు (శుక్రవారం), నెం.07154 ఎస్‌ఎంవీటీ బెంగళూరు-నరసాపురం ప్రత్యేక రైలు మే 10 నుంచి జూన్‌ 28వ తేది వరకు (శనివారం) తలా 8 సర్వీసులుగా పొడిగించారు.


nani2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి

ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా

మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..

బూడిద గుమ్మడితో భలే భలేగా

రజతోత్సవ వేళ రగిలే ప్రశ్నలు

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2025 | 12:23 PM