RCB-Stampede: తొక్కిసలాట కేసులో RCB యాజమాన్యంపై విచారణ
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:39 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ క్రమంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి టీం యాజమాన్యం విచారణ ఎదుర్కోబోతోంది. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) సీనియర్ సభ్యులను కూడా విచారించనున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం ఆపై జరిగిన తొక్కిసలాటకు సంబంధించి టీం యాజమాన్యం విచారణ ఎదుర్కోబోతోంది. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) సీనియర్ సభ్యులను కూడా విచారించనున్నారు. ఆర్సీబీ క్రికెటర్లకు సత్కార వేడుకను ప్లాన్ చేయడంలో వీరి పాత్రను ఇప్పుడు బెంగళూరు పోలీసులు, ఇంకా మెజిస్టీరియల్ విచారణ ప్యానెల్ సమీక్షిస్తోంది. ముఖ్యంగా తొక్కిసలాటకు కొన్ని గంటల ముందు RCB మేనేజ్మెంట్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్పై విచారణ జరగనుంది.
ఆర్సీబీ క్రికెట్ టీం విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవం, ఆపై జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, 47 మంది గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, ఘటనకు కొన్ని గంటల ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం సోషల్ మీడియా 'ఎక్స్'లో ఈవెంట్ కు సంబంధించి అధికారికంగా ఒక పోస్ట్ పెట్టింది.
జూన్ 4వ తేదీ మధ్యాహ్నం గం. 3:14కు ఆర్సీబీ అఫీషియల్ 'ఎక్స్' హ్యాండిల్లో ఈ పోస్ట్ పెట్టింది. 'విక్టరీ పరేడ్ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు జరుగుతాయి. అందరూ రోడ్షోను శాంతియుతంగా ఆస్వాదించగలిగేలా పోలీసులు, ఇతర అధికారులు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని మేము అందరు అభిమానులను అభ్యర్థిస్తున్నాము. ఉచిత పాస్లు (పరిమిత ప్రవేశం)shop.royalchallengers.comలో అందుబాటులో ఉన్నాయి" అని సదరు పోస్ట్లో పేర్కొన్నారు. దీనిపైనే ముఖ్యంగా దర్యాప్తు చేయనున్నారు.
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత RCB తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోసుకునే క్రమంలో జూన్ 4 బుధవారం మధ్యాహ్నం తొక్కిసలాట జరిగింది. అయితే, ఈ ఈవెంట్ నిర్వహించుకోడానికి జూన్ 3వ తేదీన ఆర్సీబీ యాజమాన్యం కేఎస్సీఏ ద్వారా అధికారులకు ఒక లేఖ పంపింది. విధానసౌధలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలనేది ఈ లేఖ సారాంశం. అయితే, చివరి నిమిషంలో ఈ ఈవెంట్కు అనుమతి వచ్చిందని కర్నాటక ప్రభుత్వం చెబుతుండగా, ప్రోపర్ ప్లానింగ్ దృష్ట్యా ఈ వేడుకను కనీసం రెండు రోజులు వాయిదా వేయాలని కోరామని బెంగళూరు పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
ఇవికూడా చదవండి: