Indian Railways: భారత సైనిక రైళ్ల కదలికలపై పాక్ నిఘా...రైల్వే శాఖ అప్రమత్తం
ABN , Publish Date - May 07 , 2025 | 09:36 PM
సైనిక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే శాఖ తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అడ్వయిజరీ ఈనెల 6న జారీ చేసింది.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం క్రమంలో భారత సైనిక రైళ్ల (Military trains) కదలికలను తెలుసుకునేందుకు పాక్ నిఘా సంస్థలు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని రైల్వే శాఖ అనుమానిస్తోంది. ఇందుకు సంబంధించిన నిఘా సమాచారం ఉండటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. సైనిక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అడ్వయిజరీ ఈనెల 6న జారీ చేసింది.
Pahalgaam Terror Attack : ఫొటోలు, వీడియోలు షేర్ చేయమని కోరిన ఎన్ఐఏ
''పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు రైల్వే అధికారులకు ఫోన్ చేసి మిలటరీ ప్రత్యేక రైళ్ల సమాచారం అడగవచ్చు. మిలటరీ వింగ్ ఆఫ్ రైల్వేస్కు మినహా అనధికార వ్యక్తులెవరితోనైనా ఈ సమాచారం పంచుకుంటే దానిని భద్రతా ఉల్లంఘన కింద భావించాల్సి ఉంటుంది. ఇందువల్ల జాతి భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది'' అని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్లకు రైల్వే బోర్టు సందేశం పంపింది.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: వ్యోమికా, ఖురేషీ గురించి ఈ విషయాలు తెలుసా
Operation Sindoor: భారత్ సైనిక దాడులపై పాక్ రక్షణ మంత్రి ఏమన్నారంటే
ఆపరేషన్ సిందూర్లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా