Share News

Pavan Kalyan: 26న చెన్నైకి పవన్‌ కల్యాణ్‌

ABN , Publish Date - May 22 , 2025 | 10:59 AM

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదల పవన్‌ కల్యాణ్‌ 26వతేదీన చెన్నైలో పర్యటించనున్నారు. 26వ తేదీ ఉదయం10 గంటలకు చెన్నైలోని రామచంద్ర కన్వెన్షన్‌ హాలులో జరిగే ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ అనే అంశంపై జరగనున్న సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Pavan Kalyan: 26న చెన్నైకి పవన్‌ కల్యాణ్‌

చెన్నై: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pavan Kalyan) ఈనెల 26న చెన్నైకి రానున్నారు. స్థానిక తిరువాన్మియూరులో ఉన్న రామచంద్ర కన్వెన్షన్‌ హాలులో ఉదయం 10 గంటలకు వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ అనే అంశంపై జరగనున్న సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ జాతీయ కన్వీనర్‌ అనిల్‌ కె.ఆంటొని, రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కో-కన్వీనర్లు ఆర్‌.అర్జునమూర్తి, నారాయణన్‌ తిరుపతి తదితరులు కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్


nani1.jpg

కాగా జనసేనను స్థాపించాక పవన్‌కల్యాణ్‌ చెన్నై వచ్చి స్థానిక మీడియాతో సమావేశమయ్యారు. తన పార్టీ లక్ష్యాలు, పార్టీ స్థాపనకు గల కారణాలను వివరించి తనను తాను పరిచయం చేసుకున్నారు. అయితే.. ఉపముఖ్యమంత్రి అయ్యాక ఆయన చెన్నైకి రావడం ఇదే తొలిసారి కావడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..

కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

Read Latest Telangana News and National News

Updated Date - May 22 , 2025 | 10:59 AM