Shehbaz Sharif: భారత్లో పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ నిలిపివేత
ABN , Publish Date - May 02 , 2025 | 08:28 PM
షహబాజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా భారత్లో బ్లాక్ చేశారు. షహబాజ్ కంటెండ్ను రిస్ర్కిక్ట్ చేయాలంటూ లీగల్ రిక్వెస్ట్ రావడంతో ఆయన భారత్ అకౌంట్ను రద్దు చేశామని ఆయన ఇన్స్ట్రా అకౌంట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వారికి సందేశం కనిపిస్తోంది.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అధికారిక యూట్యూబ్ ఛానెల్, ఇన్స్ట్రా అకౌంట్ను మనదేశంలో నిలిపివేసింది. జాతీయ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు షహబాజ్ యూట్యూబ్ ఛానల్ కంటెంట్ భారత్లో అందుబాటులో లేదనే మెసేజ్ ఆ ఛానెల్ వీక్షకులకు దర్శనమిస్తోంది.
Mallikarjun Kharge: ఉగ్రదాడిని ఎదుర్కొనేందుకు నిర్దిష్ట వ్యూహం ఏది?.. కేంద్రాన్ని ప్రశ్నించిన ఖర్గే
షహబాజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా భారత్లో బ్లాక్ చేశారు. షహబాజ్ కంటెండ్ను రిస్ర్కిక్ట్ చేయాలంటూ లీగల్ రిక్వెస్ట్ రావడంతో ఆయన భారత్ అకౌంట్ను రద్దు చేశామని ఆయన ఇన్స్ట్రా అకౌంట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వారికి సందేశం కనిపిస్తోంది. కాగా, షెహబాజ్ ''ఎక్స్'' ఖాతా అయితే ప్రస్తుతానికి నడుస్తోంది.
ఉద్రిక్తతల వేళ ఇప్పటికే పాక్ కేంద్రంగా నడుస్తున్న 16 యూట్యూబ్ ఛానెళ్ల ప్రసారాలను భారత్లో నిలిపేశారు. పాక్ న్యూస్, ఎంటర్టైన్మెట్ మీడియాకు చెందిన పలు ఛానెళ్లపై వేటుపడింది.
ఇవి కూడా చదవండి..