Share News

Pakistan: ఇస్లామాబాద్, లాహోర్‌లో నో-ఫ్లై జోన్ ప్రకటించిన పాక్

ABN , Publish Date - Apr 30 , 2025 | 03:19 PM

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌పై భారత్ కఠిన చర్యలకు దిగడంతో పాకిస్థాన్ సైతం భారత్‌పై కఠిన చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశ విమానాలకు తమ ఎయిర్‌స్పేర్‌ను మూసేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది.

Pakistan: ఇస్లామాబాద్, లాహోర్‌లో నో-ఫ్లై జోన్ ప్రకటించిన పాక్

న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్రవాదులు నరమేథానికి పాల్పడి 26 మంది టూరిస్టులను కాల్చిచంపిన తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏ క్షణంలోనైనా భారత్ సైనిక చర్యకు దిగవచ్చంటూ పాక్ నేతలు బహిరంగంగా ప్రకటిస్తూనే, గట్టి గుణపాఠం చెబుతామనే రీతిలో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్, లాహార్‌లో నో-ఫ్లై జోన్‌ (no-fly zone)ను ప్రకటించింది. మే 2వ తేదీ వరకూ ఇది అమలులో ఉంటుందంటూ 'నో టు ఎయిర్‌మన్' (NOTAM) నోటీసు జారీ చేసింది. ఆ ప్రకారం నిర్దేశిత గగనతలంలోకి ఏ విమానం కూడా ప్రవేశించరాదు.


జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి గట్టి జవాబిస్తామంటూ భారత్ విస్పష్టంగా ప్రకటించడంతో ఇస్లామాబాద్, లాహోర్ ఎయిర్‌స్పేస్‌లో ఈ NOTAM నోటీసును పాక్ జారీ చేసింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో మిలటరీ దాడులకు భారత్ వ్యూహరచన చేస్తున్నట్టు ఇంజెలిజెన్స్ సమాచారం తమ వద్ద ఉందని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లాహ్ తరార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హహల్గాం దాడిలో పాక్ ప్రమేయం ఉందంటూ న్యూఢిల్లీ కల్పిత, నిరాధార ఆరోపణలు చేస్తోందని, సైనిక దురాక్రమణ చర్యలకు పాల్పడేందుకే ఈ వాదనలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది.


కాగా, పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌పై భారత్ కఠిన చర్యలకు దిగడంతో పాకిస్థాన్ సైతం భారత్‌పై కఠిన చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశ విమానాలకు తమ ఎయిర్‌స్పేర్‌ను మూసేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

Classroom Scam: రూ.2,000 కోట్ల కుంభకోణం.. ఆప్ నేతలపై ఏసీబీ కేసు

Pahalgam Terror Attack: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..

India Vs Pak: కవ్విస్తున్న పాక్.. యుద్ధం తప్పదా..

Updated Date - Apr 30 , 2025 | 03:37 PM