Home » Islamabad
జైషే వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 2న ఇసార్ మరణించాడని, అతని మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించారని తెలుస్తోంది. గుండెపోటుతో ఆయన మరణించి ఉండచ్చని చెబుతున్నారు. అయితే ఇతమిత్ధమైన కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు.
లష్కరే తొయిబా టాప్ కమాండర్ అబు సైఫుల్లాకు వినోద్ కుమార్, మొహమ్మద్ సలీమ్, ఖలీద్, వనియాల్, వాజిద్, సలీమ్ భాయ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. లష్కరే ఆపరేషన్లు, రిక్రూట్మెంట్ల నిర్వహణ, నిధుల సమీకరణ, సరిహద్దు చొరబాట్లలో సైఫుల్ కీలకంగా వ్యవహించే వాడు.
ఆపరేషన్ సిందూర్’లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యుద్ధ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇండియా మరోసారి తమపై యుద్ధానికే దిగితే సర్వస్వం కోల్పోతుందని హెచ్చరించారు.
పాక్ చేపట్టిన కౌంటర్ ఆపరేషన్కు ఇస్లామిక్ పదజాలం వాడటం, తెల్లవారుజామున దాడులకు దిగడం వెనక ఉద్దేశంలో పాక్ జర్నలిస్ట్ ఒకరు లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ను ప్రశ్నించినప్పుడు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడడానికి దౌత్యమార్గాలను అన్వేషించాలని తన సోదరుడు, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు మాజీ ప్రధాని నవాజ్ షరీప్ సూచించినట్టు 'ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' ఒక కథనం లో పేర్కొంది.
పాకిస్థాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడం గత శనివారం నుంచి ఇది రెండోసారి. 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన 'అబ్దాలీ వెపన్ సిస్టమ్' అనే బాలిస్టిక్ క్షిపణిని శనివారంనాడు పరీక్షించింది. భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనందని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్పై భారత్ కఠిన చర్యలకు దిగడంతో పాకిస్థాన్ సైతం భారత్పై కఠిన చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశ విమానాలకు తమ ఎయిర్స్పేర్ను మూసేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది.
పాక్ ఆర్మీతో కానీ, ఐఎస్ఐఎస్తో కానీ రాణాకు ఎలాంటి సంబంధం లేదనే విషయం బహిరంగ రహస్యమేనని, అయితే ముంబై దాడుల్లో పాక్ ప్రమేయం ఉందంటూ తమదేశంపై ఎలాంటి విష బీజాలు నాటుతాడోనని తాము భయపడుతున్నామని విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి పాల్పడ్డారనే కేసులో గత జనవరిలో ఇమ్రాన్కు 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పువెలువడింది.
పాకిస్థాన్లో టెర్రరిజాన్ని ఇండియా ప్రోత్సహిస్తోందని, అయితే జాఫర్ ఎక్స్ప్రెస్పై దాడి ఘటనలో ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్లోని ఉగ్రవాదులను కాంట్రాక్ట్ చేశారని పాక్ విదేశాంగ ప్రతినిధి అలిఖాన్ అన్నారు. భరత్ పొరుగుదేశాలను అస్థిర పరచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.