Pakistan: జైషే టాప్ కమాండర్ ఖతం.. మరణంపై మిస్టరీ
ABN , Publish Date - Jun 03 , 2025 | 08:34 PM
జైషే వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 2న ఇసార్ మరణించాడని, అతని మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించారని తెలుస్తోంది. గుండెపోటుతో ఆయన మరణించి ఉండచ్చని చెబుతున్నారు. అయితే ఇతమిత్ధమైన కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు.

ఇస్లామాబాద్: జైషే మహమ్మద్ (JeM) టాప్ కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ ఇసార్ (Maulana Abdul Aziz Esar) హతమయ్యాడు. పాకిస్థాన్లోని పంజాబ్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో అతను మరణించినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇండియాలో పలు ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారిగా ఇసార్ ఉన్నాడు.
జైషే ప్రధాన కార్యాలయం వద్ద అంత్యక్రియలు
జైషే వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 2న ఇసార్ మరణించాడని, అతని మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించారని తెలుస్తోంది. గుండెపోటుతో ఆయన మరణించి ఉండచ్చని చెబుతున్నారు. అయితే నిర్దిష్టమైన కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు. పంజాబ్లోని బహవాల్పూర్లో ఉన్న జైషే ప్రధాన కార్యాలయం వద్ద అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇండియాలోని పలు ఉగ్ర ఘటనల్లో..
ఇండియాలో పలు భారత్ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రదాడుల వ్యూహరచనలో ఇసార్ ప్రమేయం ఉంది. అతని మరణం వెనక అనుమానించదగిన కారణాలు ఉండొచ్చని పలువురు భద్రతా విశ్లేషకులు చెబుతున్నారు. జైషే అత్యున్నత వ్యూహకర్తలలో ఒకరైన ఇసార్ 2016 నగ్రోటా దాడితో సహా ఇండియాలో పలు ఉగ్ర కుట్రల వెనుక ఉన్నాడు. భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడమే లక్షంగా ఆయన ప్రసంగాలు ఉంటాయని చెబుతారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్తో భారత్ జరిపిన దాడిలో బహవాల్పూర్ జైషే ప్రధాన కార్యాలయం కూడా ఉండటం విశేషం.
ఇవీ చదవండి:
భారత్లో అధికార భాషపై కనిమొళి స్పెయిన్లో ఏమన్నారంటే..
పాకిస్తాన్కు షాక్.. జైలు నుంచి 200 మంది ఖైదీల పరార్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి