Share News

Karnataka: ఇద్దరి మృతదేహాలు స్వస్థలాలకు

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:29 AM

పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన మంజునాథ్‌రావ్‌, భరత్‌భూషణ్‌ మృతదేహాలు బెంగళూరు ఎయిర్‌పోర్టు ద్వారా స్వస్థలాలకు చేరి, మంత్రి, గవర్నర్‌, సీఎం నివాళులర్పించారు

Karnataka: ఇద్దరి మృతదేహాలు స్వస్థలాలకు

  • బెంగళూరు ఎయిర్‌పోర్టులో కుటుంబ సభ్యులకు అప్పగింత

బెంగళూరు, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడిలో బలైన ఇద్దరు కన్నడిగుల మృతదేహాలు గురువారం తెల్లవారు జామున బెంగళూరుకు చేరుకున్నాయి. శివమొగ్గ పట్టణానికి చెందిన మంజునాథ్‌రావ్‌, బెంగళూరుకు చెందిన భరత్‌భూషణ్‌ మృతదేహాలను కార్గోవిమానంలో ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. కేంద్రమంత్రి సోమణ్ణ నివాళులర్పించి, బంధువులను ఓదార్చారు. మంజునాథ్‌రావ్‌ మృతదేహాన్ని తుమకూరు మీదుగా శివమొగ్గకు తరలించారు. బెంగళూరు నగరం మత్తికెరె ప్రాంతానికి భరత్‌భూషణ్‌ మృతదేహాన్ని తీసుకువచ్చారు. గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, సీఎం సిద్దరామయ్య భరత్‌భూషణ్‌ మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 03:29 AM