Share News

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

ABN , Publish Date - May 13 , 2025 | 11:31 AM

Pahalgam Attack: పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌ను వణికించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది.

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు
Operation Sindoor

పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సిందూర్‌ పేరుతో ఉగ్ర స్థావరాలు, సైనిక పోస్టులు, ఎయిర్‌బేస్‌లపై అటాక్ చేసి ధ్వంసం చేసింది ఇండియా. యుద్ధం కోరుకున్న పాక్‌కు ముచ్చెమటలు పట్టించింది. భారత్ పేరు చెబితే భయపడేలా చేశాయి మన త్రివిధ దళాలు. ఎట్టకేలకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరగడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కానీ భారత ఆర్మీ మాత్రం ఇంకా ఆపరేషన్ సిందూర్‌ కొనసాగిస్తోంది. ఆ రాక్షసుల కోసం అణువణువూ జల్లెడ పడుతోంది. ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు ఇస్తామని చెబుతోంది. అసలు జమ్మూ కశ్మీర్‌లో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..


పట్టిస్తే రివార్డు పక్కా..

పహల్గాం దాడుల నిందితుల గాలింపును మరింత ముమ్మరం చేసింది భారత ఆర్మీ. ఆ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రదాదులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే జమ్మూ కశ్మీర్ పోలీసులు రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. ఆ టెర్రరిస్టుల జాడ తెలిపిన వారికి ఇరవై లక్షల బహుమతి ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఉగ్రవాదుల ఫొటోలు ఉన్న పోస్టర్లను జమ్మూతో పాటు కశ్మీర్ లోయలో అతికించారు. టెర్రరిస్టులను పట్టిస్తే రివార్డు ఖాయమని అంటున్నారు. కాగా, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడిలో 26 మంది అమాయక పర్యాటకులను చంపేశారు టెర్రరిస్టులు. దీనికి ప్రతీకారంగానే ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులపై దాడులకు తెగబడింది భారత్.


ఇవీ చదవండి:

మారని పాక్ బుద్ధి

భారత్‌పై 15 లక్షల సైబర్ అటాక్స్

గాజాలో ఇజ్రాయెల్‌ దాడి.

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 13 , 2025 | 11:38 AM