Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఎయిర్ఫోర్స్ సంచలన ప్రకటన
ABN , Publish Date - May 11 , 2025 | 01:15 PM
IAF: కాల్పుల విరమణకు ఇటు భారత్, అటు పాకిస్థాన్ ఒప్పుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముగిశాయని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ టైమ్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది భారత వాయుసేన. ఆపరేషన్ సిందూర్పై సంచలన ప్రకటన చేసింది ఐఏఎఫ్.

పహల్గాంలో అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చిన పాకిస్థాన్, ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్తో ప్రతీకారం తీర్చుకుంది భారత్. ప్రత్యర్థి దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఆ తర్వాత పాక్ చేసిన ప్రతిదాడుల్ని సమర్థంగా తిప్పికొట్టడమే గాక ఎదురుదాడులతో వాళ్ల మిలటరీ ఎయిర్పోస్ట్లు, ఎయిర్బేస్లను ధ్వంసం చేసింది. మన సైన్యం ధాటిని తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చిన పాక్.. ఇండియాను ఎట్టకేలకు సీజ్ఫైర్కు ఒప్పించింది. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముగిసినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదంటూ భారత వాయుసేన సంచలన ప్రకటన చేసింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఇంకా ఏమందంటే..
ఆపరేషన్ కంటిన్యూ..
ఆపరేషన్ సిందూర్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది. ఆపరేషన్ సిందూర్లో భారత వైమానిక దళానికి అప్పగించిన పనులను పూర్తి ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో విజయవంతంగా అమలు చేశామని ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్లో వెల్లడించింది. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా, ఉద్దేశపూర్వకంగా, వివేకంతో కార్యకలాపాలు నిర్వహించామని తెలిపింది. ఈ ఆపరేషన్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున, తగిన సమయంలో కంప్లీట్ బ్రీఫింగ్ ఇస్తామని పేర్కొంది ఐఏఎఫ్. అనధికారిక సమాచారం, పుకార్ల వ్యాప్తికి దూరంగా ఉండాలని ప్రజలను రిక్వెస్ట్ చేసింది భారత వాయుసేన. కాగా, ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని ఐఏఎఫ్ చేసిన ప్రకటనతో అసలేం జరుగుతోంది.. ఎయిర్ఫోర్స్ ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. సీజ్ఫైర్ను ఉల్లంఘించిన పాక్కు మరింత గట్టిగా బుద్ధి చెబుతుందా లేదా బిగ్ అటాక్కు ప్లాన్ చేశారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్-పాక్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి