Share News

Bihar Govt Formation: నితీశ్ రాజీనామా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి

ABN , Publish Date - Nov 19 , 2025 | 06:43 PM

బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను సమర్పించారు.

Bihar Govt Formation: నితీశ్ రాజీనామా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి
Nitish kumar

పాట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ (Nitish Kuamr) సారథ్యంలో మరి కొద్ది గంటల్లో ఎన్డీయే కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను సమర్పించారు. ఎన్డీయే సభ్యుల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. నితీశ్ రాజీనామాను వెంటనే ఆమోదించారు. నితీశ్ వెంట గవర్నర్‌ను కలిసి వారిలో ఎల్‌జేపీఆర్‌వీ చీప్ చిరాగ్ పాశ్వాన్, ఆర్ఎల్ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహ తదితరులు ఉన్నారు.


bihar-governer.jpg

ఉదయం నుంచి వేగంగా పరిణామాలు

కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా బుధవారం ఉదయం నుంచి పాట్నాలో వేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీయూ ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతగా నితీశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ లెసిస్లేచర్ పార్టీ నేతలు సైతం సమావేశమై పార్టీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. అనంతరం ఎన్డీయే సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దిలీప్ జైశ్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారి సహా ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ నేతగా నితీశ్ కుమార్ పేరును సామ్రాట్ చౌదరి ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలంతా బలపరిచారు. దీంతో నితీశ్ 10వ సారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ సమావేశానంతరం నితీశ్ సారథ్యంలోని పలువురు నేతలు గవర్నర్‌ను కలుసుకున్నారు.


ముహూర్తం ఖరారు

మరోవైపు, నితీశ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..

ఈడీ కస్టడీకి అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 19 , 2025 | 07:43 PM