Share News

NDA Meeting: ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం

ABN , Publish Date - May 25 , 2025 | 10:19 AM

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన NDA ముఖ్యమంత్రులు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. స్థానిక అశోకా హోటల్‌లో మధ్యాహ్నం 3 వరకు ఈ సమావేశం జరగనుంది.

NDA Meeting: ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం
NDA Meeting

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన NDA ముఖ్యమంత్రులు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. స్థానిక అశోకా హోటల్‌లో మధ్యాహ్నం 3 వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరుకావడం లేదని బీజేపీ పెద్దలకు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ , జనగణనలపై రెండు తీర్మానాలను ఈ NDA సమావేశంలో ఆమోదించనున్నారు. ప్రధాని మోదీ మూడో టర్మ్‌లో ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సిందూర్, దేశ భద్రత , కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.


Also Read:

ఎస్-400 లాంటి ఫవర్‌ఫుల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇవే..

RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..

Read Latest and International News

Updated Date - May 25 , 2025 | 10:25 AM