Home » Chandra Babu
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలోనే ప్రముఖ టెక్ హబ్గా నిలబెట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాస్కామ్ బృందంతో ఇవాళ అమరావతిలో సమావేశమయ్యారు.
పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివాదాలకు ఇక చోటు లేకుండా పోనుంది. భూ రికార్డుల రిజిటలైజేషన్తో పక్కాగా ప్రజలకు వారివారి ఆస్తులమీద హక్కు దక్కనుంది.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన NDA ముఖ్యమంత్రులు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. స్థానిక అశోకా హోటల్లో మధ్యాహ్నం 3 వరకు ఈ సమావేశం జరగనుంది.
తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానం, భక్తుల సౌకర్యం, ఆలయ నిర్వహణలో పారదర్శకత, సామర్థ్యం కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు గత 11 నెలల కాలంలో తిరుమలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.
కుప్పంలో మంగళవారం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ శిరస్సు ఊరేగింపు ఘట్టం నభూతో.. న భవిష్యతి అన్నట్టుగా సాగింది.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వైసీపీ హయాంలో నిలిపివేసిన బేబీ కిట్ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది.
కుప్పానికి ‘వాహన’యోగం పట్టింది. రెండు అంబులెన్స్లు, నాలుగు ఈ-ఆటోలు ఇప్పటికిప్పుడు రావడమే కాదు, ఇంకో 90 దాకా ఈ-ఆటోలకు ఒప్పందం కుదిరింది. ఒప్పందమంటే ఇదేదో నగదు చెల్లించే పరస్పర ఒప్పందం కాదు, ఉచితంగా అన్ని ఆటోలూ కుప్పం చేరబోతున్నాయి.
కుప్పంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. క్షేత్ర స్థాయి సిబ్బందే కాదు, మండల స్థాయి అధికారుల పోస్టులు కూడా ఖాళీగానే ఉండి, ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. మరోవైపు సాధారణంగా జరిగే ఉపాధి పనులతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన సిమెంటు రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణం కూడా ఉపాధి హామీకి అనుసంధానించడంతో పని ఒత్తిడి ఎక్కువై సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది. అధికారంలోకి వస్తే తాము మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలబెట్టుకుంది.
క్రమశిక్షణ గల విద్యార్థి.. దార్శనికత గల నాయకుడిగా ఎదిగారని చంద్రబాబు నాయుడును ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్నారు.