Mangaluru: మంగళూరులో హై అలర్ట్.. ఎందుకంటే..
ABN , Publish Date - May 02 , 2025 | 12:45 PM
Mangaluru on High Alert: మంగళూరులో సుహాస్ శెట్టి అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఐదు మంది వ్యక్తులు నడి రోడ్డుపై అతడ్ని వేట కొడవళ్లు, కత్తులతో నరికి చంపారు. దీంతో అధికారులు సిటీలో హై అలర్ట్ ప్రకటించారు.

Rowdy Sheeter Suhas Shetty Murderd: కర్ణాటకలోని మంగళూరులో రౌడీ షీటర్ సుహాస్ శెట్టిని గురువారం కొందరు దుండగులు రద్దీగా ఉన్న రోడ్డుపై ఘెరంగా నరికి చంపారు. ఈ హింసాత్మక ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో అధికారులు (BNSS) సెక్షన్ 163 కింద మంగళూరులో నిషేధాజ్ఞలు విధించారు. మే 2 నుంచి 4 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ముప్పై ఏళ్ల సుహాస్ శెట్టి 2022లో ఫాజిల్ హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్నాడు. బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకు ప్రతీకారంగా సూరత్కల్కు చెందిన ఫాజిల్ ను సుహాస్ హత్య చేశాడనే ఆరోపణలున్నాయి. దీంతో సుహాస్ ను అంతమొందించేందుకు కొందరు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ బాజ్బేలో జరిగిన దాడిలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన సుహాస్.. ఈ సారి తప్పించుకోలేకపోయాడు. నగరంలోని బాజ్పే కిన్నిపడవు సమీపంలో ఐదుగురు వ్యక్తులు కలిసి సుహాస్ ను దారుణంగా చంపారు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సుహాస్ హత్య జరిగిన కొన్ని నిముషాల్లోనే Troll_mayadiaka అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'Finish' అనే పోస్ట్ తో పాటు హత్య వీడియోను హంతకులు షేర్ చేశారు. నెక్ట్స్ వికెట్ కూడా త్వరలోనే పడబోతోంది అంటూ పోస్ట్ చేయడంతో మంగళూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హత్యకు గురైన సుహాస్ శెట్టి హిందూ కార్యకర్త. గతంలో బజరంగ్ దళ్ గో సంరక్షణ విభాగంలో సభ్యుడు. సుహాస్ శెట్టిపై మొత్తం 5 కేసులు ఉన్నాయి. బాజ్పే పోలీస్ స్టేషన్లో 3 కేసులు, బెల్తంగడి, సూరత్కల్ పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఒక కేసులో కోర్టు దోషిగా నిర్ధారించగా, రెండు కేసుల్లో విచారణ జరుగుతోంది. మరో రెండు కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యాడు.
Read Also: Pahalgam Terror Attack: ఎన్ఐఏ నివేదిక.. వెలుగులోకి సంచలన విషయాలు
Priyanka Chaturvedi: ఓటీటీ షోలో అసభ్య కంటెంట్..ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
Heavy Rains: న్యూఢిల్లీలో రెడ్ అలర్ట్..విమాన సర్వీసులపై ఎఫెక్ట్