Parliament 2025: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:49 PM
Parliament Monsoon session 2025 Dates: ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. ఇంతలోనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది. ఈ సమావేశాల్లో అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

Kiren Rijiju Reveals Monsoon Session Dates: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రవాద దాడిపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కీలకమైన బీమా సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 100 శాతానికి పెంచుతున్నట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, బిల్లు ముసాయిదా సిద్ధంగా ఉంది. ఇది త్వరలో ఆమోదం కోసం కేబినెట్ ముందుకు రానుంది. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
గతంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా జరిగాయి. మొదటి సమావేశం జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకూ కొనసాగింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండవ భాగం మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిసింది.
ఇవి కూడా చదవండి
కర్ణాటక సీఎం టు రణ్వీర్ సింగ్.. ఆర్సీబీ విజయంపై ప్రముఖులు ఏమన్నారంటే..
18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం.. హైదరాబాద్లో సందడి మామూలుగా లేదు..
Read Latest Telangana News and National News