Home » Parliament
లోక్సభ 12 గంటలకు ప్రారంభం అయిన తర్వాత కూడా విపక్షాలు ఆందోళన చేసే అవకాశం ఉంది. విపక్షాలు సభను స్తంభింపజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 12 గంటలకు లోక్సభలో అమరావతి బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
అమరావతి చట్టబద్ధత బిల్లు బుధవారం పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర హోంశాఖ మంత్రి లోక్సభలో బిల్లును ప్రవేశ పెట్టున్నారు. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది.
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు బుధవారం పార్లమెంట్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ బిల్లును లోక్సభ బిజినెస్ జాబితాలో అధికారులు చేర్చారు.
ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో గదుల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, 11 అనే సంఖ్యకు మధ్య ఉన్న విచిత్రమైన సంబంధం ఈ ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar)ను తొలగించాలంటూ 'ఇండియా' కూటమి పార్టీలు తీర్మానాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చాయి. ఇందుకు సంబంధించిన తీర్మానం నోటీసును పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్ష నేతలు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు.
ఇంధన భద్రత విషయంలో కేంద్రం రాజీ పడిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో విపక్షాలు గురువారంనాడు నిరసనకు దిగాయి.
రాజ్యాంగ వ్యవస్థలను దుర్వనియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనుంది. విపక్ష 'ఇండియా' కూటమికి చెందిన 180 మంది ఎంపీలు ఇందుకు సంబంధించిన నోటీసుపై సంతకాలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.
పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. ఈ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
నేటి నుంచి పార్లమెంట్ రెండో దశ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానం ఆమోదం పొందుతుందా? లేక వీగిపోతుందా? సభలో అధికార, విపక్ష పార్టీల బలాబలాలెలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం...