Home » Parliament
ఒక వ్యక్తికి ఓటరుగా నమోదు చేసుకునే అర్హత లేకున్నప్పటికీ అతను ఓటరుగా నమోదు చేసుకుంటే అది ఓట్ చోరీ అవుతుందని, అనుచిత విధానాలతో ఎన్నికల్లో గెలిస్తే దానిని ఓట్ చోరీ అంటామని, ప్రజాతీర్పుకు భిన్నంగా ఒక వ్యక్తి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే అది కూడా ఓట్ చోరీ అవుతుందని అమిత్షా చెప్పారు.
పార్లమెంటులో వందేమాతరంపై 10 గంటల పాటు చర్చ జరగడాన్ని విమర్శిస్తూ బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దద్లానీ చేసిన వీడియో వైరల్గా మారింది. ఈ చర్యతో భారత్లో పలు సమస్యలు పరిష్కారమయ్యాయంటూ ఆయన చురకలు అంటించారు.
పార్లమెంటులో చర్చ ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించినప్పటికీ విపక్షాలు కేవలం ఎస్ఐఆర్పైనే దృష్టిసారించాయని, గత నాలుగు నెలలుగా ఎస్ఐఆర్పై అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అమిత్షా అన్నారు.
భారతదేశాన్ని అనేక మంది పాలించినప్పుడు ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయి నిరాశానిస్పృహలకు లోనయ్యారని, అలాంటి సమయంలో వందేమాతరం ఒక అగ్నిపర్వతంలా జనంలోకి దూసుకెళ్లిందని సుధామూర్తి అన్నారు.
వందేమాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై చర్చ ఎందుకని కొందరు సభ్యులు ప్రశ్నిస్తున్నారని, అయితే కాలంతో సంబంధం లేకుండా దేశప్రజల్లో వందేమాతరం ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉందని అమిత్షా అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకే ఈసీని వాడుకుంటున్నారని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సంస్కరణలు అమలు కావడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ నియామకంలో మోదీ, అమిత్షాకు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారో అన్నేళ్లపాటు దేశ స్వాతంత్ర్య కోసం జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారని ప్రియాంక గాంధీ గుర్తుచేశారు.
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. వందే మాతరం జాతీయ గేయం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు లోక్ సభ, రాజ్యసభలో దీని గురించి చర్చ జరుగుతోంది. సభల్లో జరిగే అంశాలన్నీ ఇక్కడ మీకోసం..
ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వాటి గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరని, ఢిల్లీ పేలుళ్ల ప్రస్తావనే లేదని, ఢిల్లీ అయినా పహల్గాం అయినా ప్రజలను రక్షించే పరిస్థితిలో మనం లేమని గౌరవ్ గొగోయ్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్కు దాసోహం అనడం, వందేమాతర గీతాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం దురదృష్టకరమని ప్రధాని అన్నారు. జిన్నా నిరసనకు దిగడంతో సుభాష్ చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారని, గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అందులో పేర్కొన్నారని, గీతాన్ని సమీక్షించాలని కోరారని వివరించారు.