Viral News: పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ.. ఫైన్ విధించిన కోర్టు, పదవి కూడా..
ABN , Publish Date - Feb 17 , 2025 | 06:24 PM
పలు సందర్భాలలో ఎంపీలు అబద్ధపు ఆరోపణలు చేయడం చూస్తుంటాం. కానీ పలు దేశాల్లోని పార్లమెంట్లలో ఇలా చేయాడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంలోనే తాజాగా ఓ ఎంపీకి కోర్టు రూ. 9 లక్షల జరిమానా విధించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ఇండియాలో పలువురు నేతలు ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు చేయడం సర్వసాధారణం. అదే పార్లమెంటులో అబద్ధపు ఆరోపణలు చేస్తే మాత్రం తీవ్రంగా పరిగణిస్తారు. కానీ ఇలాంటి అబద్ధపు ఆరోపణలు పార్లమెంటులో చేయడం ఇతర దేశాల్లో నేరంగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే సింగపూర్లో భారత సంతతికి చెందిన ప్రతిపక్ష నేత ప్రీతమ్ సింగ్(Preetam Singh)ను పార్లమెంటరీ కమిటీ ముందు అబద్ధం చెప్పిన ఆరోపణలపై కోర్టు దోషిగా నిర్ధారించింది. దీనికి సంబంధించి ఆయనకు 14,000 సింగపూర్ డాలర్లు (దాదాపు 9 లక్షల రూపాయలు) జరిమానా విధించింది.
జైలు శిక్ష లేదా..
సింగపూర్ రాజ్యాంగం ప్రకారం ఒక ఎంపీ పార్లమెంటులో అబద్ధం చెప్పినట్లైతే ఆయనకు కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు. లేదంటే కనీసం 10,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించబడుతుంది. ఈ విధంగా శిక్ష పొందిన ఎంపీ తన సీటును కూడా కోల్పోయే ఛాన్సుంది. దీంతోపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతారు. అయితే ఈ ఎంపీకి జరిమానా తక్కువ ఉండటం వల్ల వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు ఛాన్స్ ఉందని అక్కడి ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఈ కఠినమైన శిక్ష నుంచి భారత సంతతి సింగపూర్ ఎంపీ తప్పించుకోగలిగాడు. దీంతోపాటు ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయవచ్చు.
ఇండియాలో మాత్రం..
సింగపూర్లో 48 ఏళ్ల మాజీ వర్కర్స్ పార్టీ ఎంపీ రయీస్ ఖాన్పై ఆయన 2021లో తప్పుడు ఆరోపణలు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయంపై పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు ప్రారంభించి, ఆయన అబద్ధపు ఆరోపణలు చేశారని నిర్ధారించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్లలో అబద్ధం చెప్పిన విషయంలో రూల్స్ వేర్వేరుగా ఉన్నాయి. భారతదేశంలో ఎవరైనా ఎంపీ ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పినట్లయితే, అది రుజువైతే, అతనిని పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయవచ్చు. తీవ్రత ఆధారంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు.
ఇతర దేశాలలో ఎలాగంటే..
బ్రిటిష్ పార్లమెంటులో అబద్ధపు ఆరోపణలు చేయడం నేరంగా పరిగణిస్తారు. ఒక ఎంపీ పార్లమెంటులో అబద్ధం చెబితే, అతనిపై జరిమానా, జైలు శిక్ష లేదా సభ్యత్వం రద్దు చేయడం వంటి తీవ్రమైన శిక్షలు ఉంటాయి. బ్రిటన్లో పార్లమెంటరీ కార్యకలాపాలను మోసం చేయడం చాలా తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. అమెరికా పార్లమెంటులో కూడా అబద్ధం చెప్పడం తీవ్రమైన నేరంగా ఉంటుంది. పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ నేరపూరిత అభియోగాలను ఎదుర్కొంటారు.
ఇవి కూడా చదవండి:
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్పై టీవీ ఛానెల్లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News