Share News

Soldier Martyred: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జవాన్‌ మృతి

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:05 AM

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 6 పారా ఎస్‌ఎఫ్‌కు చెందిన హవల్దార్‌ ఝంటు ఆలీ షేక్‌ వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిపాయి

Soldier Martyred: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జవాన్‌ మృతి

శ్రీనగర్‌, ఏప్రిల్‌ 24: జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపూర్‌ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జవాన్‌ మృతి చెందారు. దాదు బసంత్‌గడ్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 పారా ఎస్‌ఎఫ్‌ విభాగానికి చెందిన హవల్దార్‌ ఝంటు ఆలీ షేక్‌ మరణించినట్టు ఆర్మీకి చెందిన వైట్‌నైట్‌ కార్ప్స్‌ ‘ఎక్స్‌’ ద్వారా తెలిపింది. సంఘటన స్థలంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. ఆలీ ధైర్యసాహసాలు మరువలేనివని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 03:05 AM