Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి భారత్ సారే జహా సే అచ్ఛా..
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:22 AM
అంతరిక్షం నుంచి భారత్ ఆశావాదం, నిర్భయత్వం విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోందని..

వీడ్కోలు సమావేశంలో శుభాంశు శుక్లా వ్యాఖ్య
నేడు భూమికి తిరుగు ప్రయాణం
న్యూఢిల్లీ, జూలై 13: అంతరిక్షం నుంచి భారత్ ఆశావాదం, నిర్భయత్వం విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోందని ప్రస్తుతం రోదసీ యాత్ర చేస్తున్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అన్నారు. యాక్సి యం-4 మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో రెండు వారాల పాటు ప్రయోగాలు చేసిన ఆ మిషన్ సభ్యులు సోమవారం భూమికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన వీడ్కోలు సమావేశంలో శుభాంశు మాట్లాడారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తోందన్న ప్రశ్నకు ‘సారే జహా సే అచ్ఛా’ అని సమాధానం ఇచ్చారు. 1984లో తొలిసారిగా అంతరిక్ష యాత్ర చేసిన రాకేశ్ శర్మ అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తోందన్న ప్రశ్నకు సారే జహా సే అచ్ఛా అని జవాబిచ్చారు. దానినే ప్రస్తుతం శుభాంశు గుర్తు చేశారు. ‘ఆజ్ కా భారత్ స్పేస్ సే నిదార్, గర్వ్ సే పూర్ణ్ దిక్తా హై’..భారత్ గర్వకారణంగా కనిపిస్తోందని తెలిపారు. ఐఎ్సఎ్సలో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. వారిలో ఏడుగురు ఎక్స్పిడిషన్-73 ద్వారా వెళ్లిన వారు కాగా, శుభాంశు సహా మరో ముగ్గురు యాక్సియం-4 ద్వారా వెళ్లారు. తిరుగు ప్రయాణంపై నాసా కమర్షియల్ క్రూ ప్రొగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ ఆమెరికాలో మీడియాతో మాట్లాడారు. సోమవారం ఉదయం 7.05 గంటలకు ఐఎస్ఎస్లోని హార్మోనీ మాడ్యూల్ ద్వారా ఆ నలుగురు బయటకు వచ్చి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్క్రా్ఫ్టను అధిరోహిస్తారని తెలిపారు. కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగుతారని చెప్పారు. భారత కాలమానం ప్రకారమయితే మంగళవారం సాయంత్రం 3.00 గంటలకు భూమి మీదకు వస్తారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు.