Share News

Madam N: ఎవరీ పాకిస్థానీ 'మేడమ్ N'.. భారత యూట్యూబర్లకు స్వర్గధామిక

ABN , Publish Date - Jun 05 , 2025 | 07:20 PM

Madam N. ఇది పాకిస్థాన్ ఐఎస్ఐ పెట్టుకున్న కోడ్ నేమ్. ఆమె అసలు పేరు నోషాబా షెహ్జాద్. లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ యజమాని. పాకిస్తాన్ ISIకి సహాయాకారి. భారత్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఈమె ఎంత చెబితే అంత. అదీ ఆమె పవర్.

Madam N: ఎవరీ పాకిస్థానీ 'మేడమ్ N'.. భారత యూట్యూబర్లకు స్వర్గధామిక
Madam N

ఇంటర్నెట్ డెస్క్: 'మేడమ్ ఎన్'(Madam N). ఇది పాకిస్థాన్ ఐఎస్ఐ పెట్టుకున్న కోడ్ నేమ్. ఆమె అసలు పేరు నోషాబా షెహ్జాద్. లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ యజమాని. పాకిస్తాన్ ISIకి సహాయాకారి. అంతేకాదు, ఈమె భారత్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఎంత చెబితే అంత. అదీ ఆమె పవర్. భారత యూట్యూబర్లకు వీసా ఇవ్వండి.. అని ఒక్క ఫోన్ కొడితే చాలు.. క్షణాల్లో ఇచ్చేస్తారు. అదీ ఆమె నెట్ వర్క్. ఇలానే ఆమె భారతీయ ఇన్ఫ్లుయెన్సర్లకు వీసాలు ఇప్పించడంలో చాలా కీలకంగా వ్యవహరించింది. భారత్‌లో ఐఎస్ఐ ఏజెంట్లను నియమించడంలో వారికి పాకిస్థాన్‌ ప్రయాణం కల్పించడంలోనూ, గూఢచార్య నెట్‌వర్క్‌ను స్థాపించడంలోనూ చాలా చురుకైన పాత్ర పోషించింది. అంతేకాదు, భారత యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్లకు టూరిస్ట్ వీసాలు ఇప్పించి ఆర్థికంగా బాగా లాభపడింది కూడా. ఇటీవల అరెస్ట్ అయిన భారత ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కూడా ఈమెతో మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది.

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో 'ట్రావెల్ ఏజెన్సీ' నడుపుతున్న మేడమ్ ఎన్, భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తన దేశానికి ప్రయాణించడానికి సహాయం చేయడమే కాదు, వారిని ఐఎస్ఐ గూఢచారులుగా ఉపయోగించుకోవడానికి కూడా పునాది వేసిందని దర్యాప్తు వర్గాలు అంటున్నాయి. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కింద పనిచేస్తూ, లాహోర్‌ పట్టణంలో 'జైయానా ట్రావెల్ అండ్ టూరిజం' కంపెనీని నడుపుతున్న నోషాబా షెహ్జాద్.. ఇటీవల అరెస్టు అయిన జ్యోతి మల్హోత్రా మాత్రమే కాకుండా, చాలా మంది భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లకు, అనేక మంది ఇతరులకు కూడా పాకిస్తాన్‌ను సందర్శించడానికి సహాయం చేశారని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.

Shehzad.jpgఈ 'మేడమ్ N' అనే పేరు భారత దర్యాప్తు సంస్థలకు ఎలా తెలిసిందంటే.. భారత్‌లో అరెస్టు చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లను విచారిస్తున్నప్పుడు ఈమె పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె భారత్ అంతటా దాదాపు 500 మంది గూఢచారులతో కూడిన భారీ స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోందని సదరు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. వీరంతా భారత్‌లో మామూలు జనాల్లో కలిసిపోయి స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తుంటారు. అవసరం వచ్చినప్పుడు ఐఎస్ఐ వీళ్లను వాడుకుంటుంది.


భారతదేశంలో స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ఎలా ఏర్పాటు చేయాలనేదానిపై నోషాబాకు పాకిస్తాన్ సైన్యం, ఇంకా ISI సూచనలు, సలహాలు ఇస్తుంటాయి. ఈమె భర్త రిటైర్డ్ పాకిస్థాన్ సివిల్ సర్వీసెస్ అధికారి. ఈమె చాలా మంది భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లను పాక్ సైన్యం, ఇంకా ISI కి పరిచయం చేసిందని, భారత్‌లో నివసిస్తున్న హిందువులు, సిక్కులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు. గత ఆరు నెలల్లో దాదాపు 3,000 మంది భారతీయులు, 1,500 మంది ప్రవాస భారతీయులు (NRIలు) పాకిస్తాన్‌ను సందర్శించడానికి ఆమె సహాయం చేశారని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.

శ్రీమతి షెహజాద్‌కు ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ వీసా విభాగానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమె వీసా విభాగం మొదటి కార్యదర్శి (వీసా) సుహైల్ కమర్, కౌన్సెలర్ (వాణిజ్యం) ఉమర్ షెర్యార్‌తో చాలా సార్లు సంప్రదింపులు జరిపింది. అంటే.. ఆమె కోరుకునే ఎవరికైనా "ఒక్క ఫోన్ కాల్‌తో" వెంటనే పాకిస్తాన్ వీసా లభిస్తుందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసిన ISI ఆపరేటివ్ డానిష్ అలియాస్ ఎహ్సాన్-ఉర్-రెహ్మాన్‌తో కూడా ఆమె సంప్రదింపులు జరిపింది. జ్యోతి మల్హోత్రా వ్యవహారం బయటపడిన తర్వాత, మే నెలలో డానిష్‌ను భారతదేశం నుండి బహిష్కరించారు.

Shehzad 2.jpgభారతదేశం నుండి పాకిస్తాన్‌కు పర్యాటకులను పంపడానికి ఎటువంటి వ్యవస్థ లేదా భారతీయ పౌరులకు పర్యాటక వీసాలు జారీ చేయడానికి ఎటువంటి ప్రక్రియ లేనప్పటికీ, పాకిస్తాన్ హైకమిషన్ 'మేడమ్ ఎన్' సిఫార్సు స్పాన్సర్‌షిప్‌పై సందర్శకుల వీసాలను జారీ చేస్తోంది. పాకిస్తాన్ సైన్యం, ISIతో ఆమెకు ఉన్న సంబంధాల బలంతో ఆమె కంపెనీ పాకిస్తాన్‌కు సిక్కు, హిందూ తీర్థయాత్రలను నిర్వహించే ఏకైక ఏజెన్సీ అంటే ఆమె పరిధి ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈమె కంపెనీ ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుతో కలిసి పనిచేస్తుంది.

మరోవైపు, శ్రీమతి షెహజాద్ భారతీయ యాత్రికుల నుండి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, ఆ నిధులను పాకిస్తాన్‌ను ప్రమోట్ చేయడానికి ఉపయోగించారని సదరు వర్గాలు తెలిపాయి. ఆమె ఇటీవల ఢిల్లీతోపాటు, మరిన్ని నగరాల్లో కొంతమంది ట్రావెల్ ఏజెంట్లను నియమించింది. వారంతా ఇప్పుడు ఆమె కంపెనీని సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారు.

Jyothi Malhotra.jpg


ఇవి కూడా చదవండి

వివాహంపై నోరు విప్పని ఎంపీ.. ఫొటో వైరల్

ఒళ్లు జలదరించే వీడియో.. ఒకే ఇంట్లో వంద పాములు

Updated Date - Jun 05 , 2025 | 07:35 PM