Rains: మూడురోజులు భారీ వర్షాలు.. తీరప్రాంతంలో రెడ్ అలర్ట్
ABN , Publish Date - May 29 , 2025 | 01:55 PM
రాష్ట్రంలో.. మూడురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనశాఖ ప్రకటించింది. అలాగే.. ఉత్తరకన్నడ, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాలను రెడ్ అలర్ట్గా ప్రకటించారు. కాగా.. భారీ వర్షాలపై అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీచేశారు.

బెంగళూరు: రాష్ట్రంలో మరో మూడురోజులు తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనశాఖ ప్రకటించింది. ప్రధానంగా తీరప్రాంత జిల్లాలైన ఉత్తరకన్నడ, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాలను రెడ్ అలర్ట్గా ప్రకటించారు. మంగళూరు, మూడబిదరి, ధర్మస్థళ, పుత్తూరు, సుళ్య, ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బెళగావి(Belagavi), కొడగు, శివమొగ్గ, చిక్కమగళూరు, బీదర్(Bidar), కలబురగి జిల్లాలను ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించారు.
మిగిలిన జిల్లాల్లోనూ వర్షాలు నమోదవుతాయని సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు ఉండాలని, పాతబడిన ఇళ్లల్లో నివసించరాదని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న మేరకు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. వెంటనే జిల్లా కేంద్రాలకు వెళ్లాలని ఆదేశించారు. అక్కడే మకాం వేసి సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు. జిల్లాధికారులు, సీఈఓలతో ప్రత్యేక సమావేశం జరిపేందుకు సీఎం సిద్ధమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క
Read Latest Telangana News and National News