Share News

Smart Toll System: ఎంత దూరం వెళితే అంతే టోల్‌

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:38 AM

మే 1 నుంచి వాణిజ్య వాహనాలకు జీఎన్‌ఎస్ఎస్ ఆధారిత టోల్‌ విధానం ప్రారంభం కానుంది ఎంత దూరం ప్రయాణిస్తే అంత చార్జీ కట్ అయ్యే విధంగా, జీపీఎస్ ఆధారితంగా టోల్‌ వసూలు ఉంటుంది

Smart Toll System: ఎంత దూరం వెళితే అంతే టోల్‌

  • మే 1వ తేదీ నుంచే జీఎన్‌ఎస్ఎస్ ఆధారిత విధానం

  • ఫాస్టాగ్‌ లేకుండా టోల్‌ వసూలు

  • జీపీఎస్‌ ఆధారంగా దూరం లెక్కింపు

  • తొలుత వాణిజ్య వాహనాలకు అమలు

  • 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: హైవే ఎక్కామంటే చాలు.. టోల్‌ చార్జీల మోత తప్పదు. పైగా టోల్‌గేట్ల వద్ద రద్దీ సమస్య. ఫాస్టాగ్‌ సరిగా స్కాన్‌ కాక సమయం వృధా.. టోల్‌ కట్టడం ఎలాగూ తప్పదు కానీ.. మిగతా సమస్యలు త్వరలోనే తీరిపోనున్నాయి. అంతేకాదు ఎంత దూరం ప్రయాణిస్తే అంత మేరకే చార్జీ పడుతుంది. టోల్‌గేట్ల వద్ద రద్దీ సమస్యను తీర్చడం, టోల్‌ వసూలు విధానాన్ని సులభతరం చేయడం కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన జీఎన్‌ఎస్ఎస్ (గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం) ఆధారిత టోల్‌ విధానం.. మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. తొ లుత వాణిజ్య వాహనాలకు దీన్ని వర్తింపజేస్తారు. 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు కూడా అమలు చేయనున్నారు. అప్పటి వరకు టోల్‌ గేట్లు కొనసాగుతాయి.


ఏమిటీ కొత్త విధానం?

మనం ఫోన్లలో వినియోగిస్తున్న జీపీఎస్‌ తరహా విధానమే జీఎన్‌ఎస్ఎస్. జీపీఎస్‌ కేవలం ఒక్క శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థ మాత్రమే. ఇలా గ్లోనాస్‌ (రష్యా), గెలీలియో (యూరప్‌), బైదు (చైనా), గగన్‌, నావిక్‌ (భారత్‌) తదితర నావిగేషన్‌ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇలాంటి వేజుజూర్వేరు వ్యవస్థలకు చెందిన ఉపగ్రహాలకు ఒకే సమయంలో అనుసంధానమై.. అత్యంత కచ్చితమైన లొకేషన్‌ గుర్తింపు, నావిగేషన్‌ పొందే విధానమే జీఎన్‌ఎ్‌సఎస్‌. దీనిద్వారా వాహనాలు ఏయే రోడ్లపై, ఎంతెంత దూరం ప్రయాణించాయన్నది కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

వాహనాల్లో ప్రత్యేక పరికరం..

జీఎన్‌ఎస్ఎస్ టోల్‌ విధానం అమలు చేసేందుకు బస్సులు, లారీలు, ట్రక్కులు, కార్లు.. ఇలా టోల్‌ వర్తించే ప్రతి వాహనంలో ఆన్‌బోర్డ్‌ యూ నిట్లు(ఓబీయూ)గా పిలిచే పరికరాలను బిగించుకోవాల్సి ఉంటుంది. ఈ పరికరాలు జీఎన్‌ఎస్ఎస్ ద్వారా శాటిలైట్లకు అనుసంధానం అవుతాయి. టోల్‌చార్జీలు వర్తించే హైవేలపై ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎంతెంత దూరం సదరు వాహనం ప్రయాణించినదీ నమోదవుతూ ఉంటుంది. ఆ మేరకు నిర్ధారించిన టోల్‌ చార్జీల సొమ్ము వ్యాలెట్లు లేదా బ్యాంకు ఖాతాల్లోంచి కట్‌ అవుతుంది. ఈ పరికరం కోసం ఒక్కో వాహనానికి రూ.4 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా.


ఈ వార్తలు కూడా చదవండి

తరగతి గదిలో పెచ్చులూడి పడి..

ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

దుబాయిలో అసలేం జరిగింది..?

తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2025 | 03:38 AM