Home » Toll Plaza
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఒక కీలక అప్డేట్. ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గత నెలలోనే ప్రకటించింది.
పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణంగా పంతంగి టోల్ప్లాజా నుంచి రోజుకు 35 వేల నుంచి 40 వేల వాహనాలు వెళ్తుంటాయి. నిన్న (శుక్రవారం) ఒక్కరోజే 65 వేల వాహనాలు టోల్ప్లాజాను దాటాయి.
ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో తీవ్రస్థాయికి చేరుకుంటున్న వాయు కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. సరిహద్దుల్లోని టోల్ ప్లాజాలు ట్రాఫిక్ ఆటంకాలు, క్యూలకు దారితీసి కాలుష్యాన్ని పెంచుతున్నాయని గుర్తించింది.
రహదారులకు అడ్డంగా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయడం చూస్తున్నాం. ఇకిప్పుడు టోల్ ప్లాజాలు ఉండవ్. నిర్ణీత ప్రదేశాల్లో రోడ్లపైన ఏర్పాటు చేసిన కెమెరాలతో కూడిన ప్రత్యేక స్ట్రక్చర్లు ఆటోమేటిక్గా టోల్ వసూలు చేసుకుంటాయి.
అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ప్లాజాలలో టోల్ మినహాయింపు కల్పిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనగోలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టోల్గేట్ల వద్ద జాప్యానికి, ఇతర సమస్యలకు కారణమవుతున్న ‘లూజ్ ఫాస్టాగ్’లను బ్లాక్లి్స్టలో పెట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది.
హైవేపై కనీస వసతులు లేకపోవడంపై తాము చాలాకాలంగా నిరసనలు తెలుపుతున్నామని ఎంఎన్ఎస్ వాషిం జిల్లా ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజు పాటిల్ కిడ్సే తెలిపారు. టోల్ ప్లాజా ఇంకా రెడీ కాలేదని, అయితే టోల్ ఫీస్ వసూలు మొదలుపెట్టేశారని చెప్పారు.
జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లు దగ్గర్నుంచి భారీ వాహనాల వరకు టోల్ ఫీజు కట్టాల్సిందే. ద్విచక్రవాహనాలకు, ఆటోలకు మాత్రం టోల్ ఫీజు లేదు. అయితే ఇకపై జాతీయ రహదారులపై ప్రయాణించే ద్విచక్రవాహనదారులు కూడా టోల్ ఫీజు కట్టాల్సిందేనంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై టోల్ ప్లాజాల వద్ద బూస్టర్ లేన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫాస్టాగ్ను సెకన్లలో రీడింగ్ చేసే సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఈ లేన్లలో ఏర్పాటు చేశారు.
తక్కువ ఖర్చుతో ఏవిధమైన ఇబ్బందుల్లేకుండా దేశం మొత్తం ప్రయాణించేందుకు పాస్ను తీసుకొచ్చామన్నారు