Share News

Moscow Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. భారత ఎంపీల విమానం గాల్లో..!

ABN , Publish Date - May 23 , 2025 | 02:31 PM

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్.. అంతర్జాతీయంగానూ శత్రుదేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దౌత్య యుద్ధాన్ని షురూ చేసింది. పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించింది.

Moscow Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. భారత ఎంపీల విమానం గాల్లో..!
Drone Attack

పాకిస్థాన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది భారత్. తమతో పెట్టుకుంటే ఎట్లుంటదో శత్రుదేశానికి చూపిస్తోంది. ఉగ్రవాదం, జమ్మూ కశ్మీర్ విషయంలో తగ్గేదేలే అని అంటోంది. పహల్గాం దాడి ఉదంతం తర్వాత నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ విషయంలో ఇండియా పూర్తి కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌తో ఆ దేశానికి వెన్నులో వణుకు పుట్టించింది. భారత్‌తో యుద్ధం కాదు కదా, ఇటు వైపు ఒక్క తూటా పేల్చాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించుకునేలా చేసింది. ఇక్కడితో ఆగని భారత్.. దౌత్య యుద్ధంతో అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా శత్రుదేశ దుశ్చర్యలను ఎండగట్టేందుకు మన దేశ విధానాన్ని వివరించేందుకు ఎంపీల బృందాలను విదేశాలకు పంపుతోంది. అయితే ఈ క్రమంలో రష్యా వెళ్లిన మన ఎంపీల బృందానికి అనుకోని చిక్కు వచ్చిపడింది. సరిగ్గా భారత ఎంపీల విమానం అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో రష్యా మీద డ్రోన్ దాడి చేసింది ఉక్రెయిన్. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


సిగ్నల్ రావడంతో..

డ్రోన్ అటాక్ కారణంగా భారత ప్రతినిధి బృందం ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అవ్వలేదు. రష్యా రాజధాని మాస్కో మీదుగా ఆ ఫ్లైట్ చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. డ్రోన్ దాడుల కారణంగా మాస్కోలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో విమానాల కదలికలు నిలిచిపోయాయి. దీంతో భారత ఎంపీల విమానం చాలా సేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆఖరుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో మాస్కోలో ఆ విమానం ల్యాండ్ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అఖిలపక్ష బృందాన్ని మాస్కోలోని భారత రాయబారి వినయ్ కుమార్ ఘనంగా స్వాగతించారు. కాగా, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి రష్యా సర్కారుతో పాటు అక్కడి ఎంపీలు, అధికారులు, నిపుణులకు సమాచారం అందించనున్నారు భారత ఎంపీలు. రష్యాతో ఇండియాకు ఇప్పటికే బలమైన సంబంధాలు ఉన్నాయని ఎంపీ కనిమొళి అన్నారు. పాక్ టెర్రరిస్టులు మొత్తం ప్రపంచానికి ముప్పుగా మారారని, ఇదే విషయాన్ని తాము రష్యాకు వివరంగా చెబుతామన్నారు.


ఇవీ చదవండి:

భారత సైన్యాన్ని మెచ్చుకున్న అమిత్ షా

ఆర్గానిక్ ఉత్పత్తులకు కొత్త ప్రపంచం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 03:39 PM