CM Siddaramaiah: కొవిడ్పై ఆందోళన వద్దు.. మాస్క్లు ధరించాలి
ABN , Publish Date - May 27 , 2025 | 01:29 PM
కోవిడ్పై ఆందోళన వద్దే వద్దని, ఎవరూ భయపడాల్సిన అవపరం కూడా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అయితే.. జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ముందు జాగ్రత్తగా మాస్క్లు ధరించాలని ఆయన కోరారు.

- జాగ్రత్తలు పాటించాల్సిందే
- పిల్లలకు జలుబు, జ్వరం ఉంటే పాఠశాలలకు పంపవద్దు
- వెంటిలేటర్లు, మందులు అందుబాటులో ఉండాలి: ప్రత్యేక సమావేశంలో సీఎం సిద్దరామయ్య
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్పై ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందేనని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) స్పష్టం చేశారు. తన అధికారిక నివాసం ‘కావేరి’లో ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు, వైద్యవిద్యాశాఖ మంత్రి శరణ్ప్రకాశ్ పాటిల్, చీఫ్ సెక్రటరీ శాలిని రజనీశ్తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. ప్రస్తుతానికి కొవిడ్ విషయంలో ఆందోళన అవసరం లేదని, కానీ అవసరమైన సౌకర్యాలను సిద్ధం చేసుకోవాలన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్, మందులు అన్ని చోట్లా అందుబాటులో ఉండాలన్నారు. వయసు పైబడినవారు, గర్భిణులు, హృదయ సంబంధిత, శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొనేవారు, ముందు జాగ్రత్తగా మాస్క్లు ధరించాలన్నారు. వారానికి ఒకటి రెండు రోజులు సమావేశం అవ్వాలని అధికారులను ఆదేశించారు.
గర్భిణులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆసుపత్రులు మార్చే విధానాన్ని ఆపాలని, అన్ని ఆసుపత్రులల్లోనూ సౌకర్యాలు ఉంటాయన్నారు. జలుబు, జ్వరం ఉంటే పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులను పంపరాదని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. జనవరి నుంచి కొవిడ్ కేసులు అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయని, మే నాల్గోవారానికి 62మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. తీవ్రత కలిగింది మాత్రమే ఒకరికేనన్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్లు ధరించాలని సూచించారు. ఆందోళన పడకుండా అప్రమత్తంగా ఉండి ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!
Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి
Read Latest Telangana News and National News